Gold And Silver Price Today: బంగారం కొనాలనుకునేవారికి షాక్.. పెరిగిన ధరలు..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు వరుసగా ఐదో రోజు పెరిగాయి. దేశంలో బంగారం ధరలు (Gold Price Today) ఈ విధంగా ఉన్నాయి. బుధవారం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.53,150గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.57,980గా నమోదైంది.
- Author : Gopichand
Date : 15-03-2023 - 8:15 IST
Published By : Hashtagu Telugu Desk
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు వరుసగా ఐదో రోజు పెరిగాయి. దేశంలో బంగారం ధరలు (Gold Price Today) ఈ విధంగా ఉన్నాయి. బుధవారం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.53,150గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.57,980గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 72,000 పలుకుతోంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక బుధవారం (మార్చి 15, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,310 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.58,140గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.53,910 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,810గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,160 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.57,990 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.53,160 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,990గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,210 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,040గా ఉంది.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 68,500 ఉండగా, ముంబైలో రూ.68,500గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.72,000 ఉండగా, కోల్కతాలో రూ.68,500గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.72,000 ఉండగా, కేరళలో రూ.72,000గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.72,500 ఉండగా, విజయవాడలో రూ.72,500 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.