Gold Price Today: దేశ వ్యాప్తంగా నేటి బంగారం, వెండి ధరలివే.. తగ్గిన ధరలు..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) మరోసారి తగ్గాయి. ఆదివారం ఉదయం 8 గంటల వరకు హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,750గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,820గా నమోదైంది.
- By Gopichand Published Date - 08:20 AM, Sun - 23 April 23
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) మరోసారి తగ్గాయి. ఆదివారం ఉదయం 8 గంటల వరకు హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,750గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,820గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.80,400కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఆదివారం (ఏప్రిల్ 23, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,970గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,050 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,150గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,750 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.60,820 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,820గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,870గా ఉంది.
Also Read: PBKS vs MI:వాంఖడేలో ముుంబైకి షాక్.. హై స్కోరింగ్ మ్యాచ్ లో పంజాబ్ విక్టరీ
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 76,900 ఉండగా, ముంబైలో రూ.76,900గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.80,400 ఉండగా, కోల్కతాలో రూ.76,900గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.80,400 ఉండగా, కేరళలో రూ.80,400గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.80,400 ఉండగా, విజయవాడలో రూ.80,400 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
Related News
China VS Gold : భారీగా గోల్డ్ కొనేస్తున్న చైనా.. గోల్డ్ రేట్లు అందుకే పెరుగుతున్నాయా ?
చైనా ఇప్పుడు గోల్డ్ మంత్రాన్ని జపిస్తోంది. భారీగా గోల్డ్ను కొనేస్తోంది.