Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాలలో నేటి ధరలివే..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు పెరిగాయి. గురువారం ఉదయం వరకు 22 క్యారెట్ల బంగారంపై రూ.500, 24 క్యారెట్లపై రూ.550 పెరిగింది.
- Author : Gopichand
Date : 13-04-2023 - 8:15 IST
Published By : Hashtagu Telugu Desk
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు పెరిగాయి. గురువారం ఉదయం వరకు 22 క్యారెట్ల బంగారంపై రూ.500, 24 క్యారెట్లపై రూ.550 పెరిగింది. గురువారం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,200గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,310గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.81,400కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక గురువారం (ఏప్రిల్ 13, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,360 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,470గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,810 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,970గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,210 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.61,320 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,210 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,320గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,370గా ఉంది.
Also Read: Rahul Gandhi: మోదీ ఇంటిపేరు వివాదం.. ఏప్రిల్ 25న కోర్టుకు హాజరు కావాలని రాహుల్ గాంధీకి నోటీసులు
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 77,350 ఉండగా, ముంబైలో రూ.77,350గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.81,400 ఉండగా, కోల్కతాలో రూ.77,350గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.81,400 ఉండగా, కేరళలో రూ.81,400గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.81,400 ఉండగా, విజయవాడలో రూ.81,400 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.