Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. పసిడి, వెండి ధరలు కాస్త తగ్గాయి..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు కాస్తా తగ్గాయి. నేడు 10గ్రాముల ఆర్నమెంట్ బంగారం రూ.350, స్వచ్ఛమైన పసిడి రూ.380చొప్పున దిగి వచ్చాయి.
- By Gopichand Published Date - 08:01 AM, Fri - 7 April 23
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు కాస్తా తగ్గాయి. నేడు 10గ్రాముల ఆర్నమెంట్ బంగారం రూ.350, స్వచ్ఛమైన పసిడి రూ.380చొప్పున దిగి వచ్చాయి. శుక్రవారం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,900గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,980గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 80,000 పలుకుతోంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక శుక్రవారం (ఏప్రిల్ 07, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,130గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,500 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,640గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,900 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.60,980 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,980గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,030గా ఉంది.
Also Read: WhatsApp: వాట్సాప్ లో మరో సరికొత్త ఫీచర్.. ఇకపై వాట్సాప్ లో అవి కనిపించవు?
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 76,490 ఉండగా, ముంబైలో రూ.76,490గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.80,000 ఉండగా, కోల్కతాలో రూ.76,490గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.80,000 ఉండగా, కేరళలో రూ.80,000గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.80,000 ఉండగా, విజయవాడలో రూ.80,000 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
Related News
Rahul Gandhi Assets: రాహుల్ గాంధీ ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవుతారు
రాహుల్ గాంధీ దాఖలు చేసిన నామినేషన్ పిటిషన్లో తన ఆస్తి వివరాలను పేర్కొన్నారు. అందులో తనకు రూ.20 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు ప్రకటించారు. అఫిడవిట్లో ఆయన పేర్కొన్న ఆస్తి విలువ వివరాలు ఇలా ఉన్నాయి: