Ganja : చెన్నైలో భారీగా గంజాయి స్వాధనం చేసుకున్న పోలీసులు.. ముగ్గురు వ్యాపారులు అరెస్ట్
చెన్నైలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ రైల్వే పోలీసులు, రెడ్హిల్స్ పోలీసులు వేర్వేరు
- By Prasad Published Date - 09:09 AM, Sat - 1 April 23

చెన్నైలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ రైల్వే పోలీసులు, రెడ్హిల్స్ పోలీసులు వేర్వేరు ఘటనల్లో 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. చెన్నై సెంట్రల్ జీఆర్పీ శుక్రవారం తెల్లవారుజామున రైల్వే స్టేషన్లో తనిఖీలు చేస్తున్నారు. తెల్లవారుజామున 4.45 గంటలకు ఢిల్లీ నుంచి గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ చెన్నై చేరుకుంది. భారీగా లగేజీతో వెళ్తున్న ఓ వ్యక్తిని పోలీసులు ఆపి తనిఖీ చేయగా అతని బ్యాగ్లో 10 కిలోల గంజాయిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కేరళలోని మలప్పురానికి చెందిన అబ్దుల్ కాదర్ (49) అనే వ్యక్తి ఢిల్లీ నుంచి చెన్నై మీదుగా కేరళకు గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఇంతలో పక్కా సమాచారం ఆధారంగా రెడ్ హిల్స్ పోలీసులు బస్టాండ్ సమీపంలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వెంట 10 కిలోల గంజాయి ఉంది. వీరందని పోలీసులు అరెస్ట్ చేశారు.