4 killed : ఏలూరులో విషాదం.. పిడుగుపాటుకు నలుగురు మృతి
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం బోగోలులో విషాదం చోటుచేసుకుంది.
- By Prasad Published Date - 11:31 AM, Wed - 17 August 22
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం బోగోలులో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి పిడుగుపాటుకు నలుగురు కూలీలు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను విజయవాడ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చెట్లను తొలగిస్తుండగా పిడుగుపాటు కూలీలపై పడినట్లు తెలిసింది. మృతులు కొండబాబు (35), ధర్మరాజు (20), రాజు (25), వేణు (18). నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కూలీలు తోట పనులకు వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన గుడారాల కింద నివసిస్తున్నారు.
Related News
AP Congress 2nd List: 6 లోక్సభ, 12 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన ఏపీ కాంగ్రెస్
ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది.