Vatti Vasantha Kumar: మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూత
మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ (Former minister Vatti Vasantha Kumar) కన్నుమూశారు. విశాఖపట్నంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు వసంత కుమార్.
- By Gopichand Published Date - 07:18 AM, Sun - 29 January 23
మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ (Vatti Vasantha Kumar) కన్నుమూశారు. విశాఖపట్నంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు వసంత కుమార్. ఆయన ఆదివారం తెల్లవారుజామున వైజాగ్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
Also Read: Earthquake: ఇరాన్లో భారీ భూకంపం.. ఏడుగురు మృతి.. 440 మందికి గాయాలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో ఆయన పనిచేశారు. వసంతకుమార్ పశ్చిమ గోదావరి జిల్లా పూండ్ల స్వస్థలం. 1955లో ఆయన జన్మించారు. 2004లో ఉంగుటూరు ఎమ్మెల్యేగా వసంత కుమార్ పనిచేశారు. తిరిగి 2009లోనూ ఆయన శాసనసభకు ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. రాష్ట్ర విభజన తీరుపై కలత చెందిన ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామమైన ఎంఎంపురం గ్రామానికి తీసుకురానున్నారు.
Related News
Srisailam: శ్రీశైలం ఆలయ హుండీల లెక్కింపు, ఎంత నగదు వచ్చిందంటే
Srisailam: భక్తుల కోరికలు శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం ఎంతోమంది భక్తులు తరలివస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా, పొరుగు రాష్ట్రాల ప్రజలు శివయ్య దర్శనం కోసం వస్తుంటారు. అయితే భారీస్థాయిలో తరలివచ్చే భక్తులు కానుకలు కూడా భారీగానే సమర్పిస్తుంటారు. అయితే గురువారం రోజున జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ.1,81,13,485/- నగదు రాబడిగా లభించింది. కాగా ఆలయ హుండీల �