Karnataka : రోడ్డు ప్రమాదంలో మాజీ ఇంటెలిజెన్స్ అధికారి మృతి.. హత్యగా అనుమానిస్తున్న పోలీసులు
- By Prasad Published Date - 06:34 AM, Mon - 7 November 22
కర్ణాటకలో ఓ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.అయితే తొలుత రోడ్డు ప్రమాదంగా పోలీసులు భావించారు. కానీ సీసీటీవీ పుటేజీలో ఓయ కారు అధికారిని గుద్దించినట్లు కనిపిస్తుండటంతో కేసు మరో మలుపు తిరిగింది.రిటైర్డ్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి ఆర్ఎస్ కులకర్ణిగా గుర్తించారు.శుక్రవారం సాయంత్రం గంగోత్రి (మైసూరు యూనివర్సిటీ) క్యాంపస్లోని కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ పక్కన రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వారు తెలిపారు.
Related News
Woman Stabs Daughter: మార్కుల విషయమై కత్తులతో పొడుచుకున్న తల్లీకూతుళ్లు.. కూతురు మృతి
కర్ణాటకలో బెంగళూరులోని బనశంకరికి చెందిన సాహితీకి ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయి. అయితే తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని తల్లి పద్మజ.. కుమార్తెతో వాగ్వాదానికి దిగింది.