HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Five Killed As Train Runs Over Them In Andhras Srikakulam District

Train Accident:శ్రీకాకుళం జిల్లాలో రైలు ప్రమాదం.. ఐదుగురు మృతి

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓ దుర్వార్తతోనే తెల్లవారింది. కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

  • Author : Hashtag U Date : 12-04-2022 - 1:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Train
Train

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓ దుర్వార్తతోనే తెల్లవారింది. కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా సిగడాం, విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలాల మధ్య ఈ ప్రమాదం జరిగింది. బాతువ సమీపంలో సోమవారం రాత్రి సమయంలో జరిగిన ఈ దుర్ఘటన అందరి మనసులను తీవ్రంగా కలిచివేసింది.

కోయంబత్తూరు నుంచి సిల్ చెర్ కు వెళ్తున్న గువాహటి ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్నవారు ఈ ప్రమాదాన్ని ఊహించి ఉండరు. కానీ చీపురుపల్లి దాటిన తరువాత వారిని మృత్యువు బలితీసుకుంది. చీపురుపల్లి దాటాక ఈ రైలులోని ఒక బోగీలోంచి పొగలు రావడాన్ని ప్రయాణికులు గమనించారు. దీంతో భయపడి చైన్ ను లాగి రైలును ఆపేశారు. అదే సమయంలో కొంతమంది రైలు దిగి పక్కనున్న పట్టాలపై నిల్చున్నారు.

ఇదే మార్గంలో భువనేశ్వర్ నుంచి విశాఖ వెళ్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ వేగంగా వచ్చింది. అప్పటికే పట్టాలపై ఉన్నవారు ఆ రైలును గమనించలేదు. దీంతో ఆ రైలు వారిని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. శరీర భాగాలన్నీ తునాతునకలయ్యాయి. మృతుల్లో ఇద్దరు అస్సాం వాసులు. ప్రమాదంలో గాయాలపాలైన వ్యక్తి.. ఒడిశాలోని బ్రహ్మపుర వాసి. ఆయనకు శ్రీకాకుళంలోని సర్వజనాసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు.

ప్రమాదం రాత్రివేళ జరగడం.. చుట్టు చిమ్మచీకటి ఉండడంతో అక్కడ సహాయక చర్యలను వేగంగా చేపట్టడానికి ఆటంకం ఏర్పడింది. రైలు ఏ కారణం వల్ల మధ్యలో ఆగిపోయినా ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రయాణికులు కిందకు దిగకూడదు. అందులోనూ రాత్రివేళ అస్సలు రైలు నుంచి బయటకు రాకూడదు. ఎందుకంటే పక్క ట్రాక్ పై ఏ రైలు వస్తుందో గమనించేలోపే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Batuwa
  • Konark express
  • srikakulam

Related News

    Latest News

    • భార‌త్‌- సౌతాఫ్రికా మ్యాచ్ ర‌ద్దు.. కార‌ణ‌మిదే?!

    • ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ నిమోనియా.. సంకేతాలివే!?

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    • 11 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి 27 దేశాల అత్యున్నత పురస్కారాలు!

    • ఢిల్లీలో ఈ స‌ర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్‌!

    Trending News

      • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

      • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

      • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

      • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

      • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd