Punjab Firing: భటిండా మిలిటరీ స్టేషన్లో విచక్షరహితంగా కాల్పులు, నలుగురు జవాన్లు మృతి
- By hashtagu Published Date - 10:08 AM, Wed - 12 April 23
పంజాబ్లోని భటిండాలోని (Punjab Firing) మిలటరీ స్టేషన్పై విచక్షణారహితంగా కాల్పులు జరిగాయి. కాల్పుల్లో నలుగురు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు కాల్పుల ఘటన జరిగినట్లు చెబుతున్నారు. కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనకు పాల్పడింది ఎవరో కూడా తెలియరాలేదు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తెల్లవారుజామున 4.35 గంటలకు కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో క్విక్ రియాక్షన్ టీమ్లను సక్రియం చేశారు. మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టి సీల్ చేశారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
Punjab | Four casualties reported in a firing incident in the early hours of the morning around 0435 hours inside Bathinda Military Station today. The Station Quick Reaction Teams were activated and the area was cordoned off and sealed. Search operation in progress: HQ SW Command pic.twitter.com/yTMAjAQAD2
— ANI (@ANI) April 12, 2023
Related News
JK Boat Accident: శ్రీనగర్లో విషాదం..పడవ మునిగి నలుగురు మృతి
జమ్మూ కాశ్మీర్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీనగర్లోని జీలం నదిలో పడవ బోల్తా పడటంతో పెను ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ముగ్గురు సురక్షితంగా బయటపడి చికిత్స పొందుతున్నారు.