Fire Accident : ఢిల్లీలోని ఎలక్ట్రానిక్ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం
పాత ఢిల్లీలోని భగీరథ్ ప్యాలెస్ ఎలక్ట్రానిక్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు 15 నుంచి 17 అగ్నిమాపక...
- By Prasad Published Date - 06:45 AM, Fri - 25 November 22
ఢిల్లీలోని భగీరథ్ ప్యాలెస్ ఎలక్ట్రానిక్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు 15 నుంచి 17 అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ఫైర్ సిబ్బంది కృషి చేస్తున్నారని మాజీ ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ తెలిపారు. అగ్నిమాపక అధికారులు, పోలీసులు సంఘటనా స్థలంలో ఉన్నారని… ఇప్పటి వరకు మంటలు అదుపులోకి రాలేదని ఆయన తెలిపారు. ఈ ఘటనలో రెండు అంతస్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని… ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.
Related News
KCR Silent: కూతురు అరెస్టై సరిగ్గా నెల..కేసీఆర్ మౌనం వీడేదెప్పుడు
ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయి సరిగ్గా నెల రోజులు కావస్తోంది. ఆమె సోదరుడు కేటీఆర్, ఆమె భర్త, తల్లి శోభను జైలులో కలిసినా.. తండ్రి కేసీఆర్ ఇంతవరకు ఆమెను పరామర్శించకపోవడం, ఎక్కడా కూడా ఆ విషయాన్ని ప్రస్తావించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.