Delhi : ఢిల్లీ ఫతేపూర్ బేరీలో అగ్నిప్రమాదం..ఐదుగురికి గాయాలు
ఢిల్లీలోని ఫతేపూర్ బేరీలోని మాన్స్వరూప్ గార్డెన్లోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు
- By Prasad Published Date - 11:28 AM, Sat - 17 December 22
ఢిల్లీలోని ఫతేపూర్ బేరీలోని మాన్స్వరూప్ గార్డెన్లోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురికి కాలిన గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం సఫ్దర్జంగ్ ఆస్పత్రికి తరలించారు. భార్యతో గొడవపడి ఓ వ్యక్తి ఇంటికి నిప్పంటించాడని సమాచారం. కొద్దిసేపటికే మంటలు వ్యాపించడంతో ఇంట్లో ఉన్నవారంతా మంటల్లో చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో దంపతులు, వృద్ధురాలు, ఇద్దరు చిన్నారులకు కాలిన గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags
Related News
Pakistan Reaction: కేజ్రీవాల్ విడుదలతో పాకిస్థాన్ లో సంబురాలు
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విడుదల వార్త పాకిస్థాన్ లోనూ హల్ చల్ చేసింది. పాకిస్థాన్ మీడియా డాన్ ఈ వార్తను ప్రచురించింది.కేజ్రీవాల్ను భారతదేశ అత్యున్నత న్యాయస్థానం విడుదల చేసింది. ఇది మోడీ ప్రభుత్వ ఓటమి అంటూ పాక్ నేతలు కూడా సంబరాలు చేసుకున్నారు.