Road Accident: నల్లగొండ జిల్లాలో ఘోర రొడ్డు ప్రమాదం, ఐదుగురు దుర్మరణం
- By Balu J Published Date - 02:16 PM, Mon - 29 January 24
Road Accident: తెలంగాణలోని నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా రెండు కుటుంబాలకు చెందిన ఐదుగురు మృతి చెందారు. మిర్యాలగూడలో ఆదివారం అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఓ మహిళ కూడా తీవ్రంగా గాయపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్పల్లి-అద్దంకి హైవేలోని కృష్ణానగర్ కాలనీలో గుర్తుతెలియని లారీ ఆటోను ఢీకొట్టింది.
మృతులు మిర్యాలగూడ మండలం నందిపాడు గ్రామానికి చెందిన వారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలోని ఆలయాన్ని సందర్శించి ఇంటికి తిరిగి వస్తున్నారు. ఇంకో నిమిషాల్లో కుటుంబం ఇంటికి చేరుకునేది. ఆ లోపే ఈ ప్రమాదం జరిగింది. మృతులను చెరుకుపల్లి మహేష్ (32), అతని భార్య జ్యోతి (30), కుమార్తె రిషిత (6), మహేష్ సహ సోదరుడు బి. మహేందర్ (32), అతని కుమారుడు లియోనిస్ (2)గా గుర్తించారు.
మహేశ్ భార్య మాధవికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించి అనంతరం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారును వెనుక నుంచి ట్రక్కు ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయింది. ట్రక్కును గుర్తించి ట్రేస్ చేసేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదంలో జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Tags
Related News
MLC By Election : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల
MLC By Election : నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విడుదల చేసింది.