IPL Fans Fight: సన్రైజర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో అభిమానుల ఫైట్
ఐపీఎల్ 2023 40వ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడింది. ఢిల్లీలోని అరుణ్ జతేలి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో హైదరాబాద్ 9 పరుగుల తేడాతో విజయం సాధించింది
- By Praveen Aluthuru Published Date - 03:36 PM, Sun - 30 April 23

IPL Fans Fight: ఐపీఎల్ 2023 40వ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో హైదరాబాద్ 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్కు 198 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు మాత్రమే చేయగలిగింది. మ్యాచ్లో ఢిల్లీ ఓటమి కంటే స్టేడియంలో అభిమానుల మధ్య జరిగిన ఫైట్ వైరల్గా మారింది. అభిమానుల గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నిజానికి ఐపీఎల్ మ్యాచ్లలో స్టేడియం మొత్తం అభిమానులతో నిండిపోతుంది, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో కూడా అభిమానులు తమ అభిమాన జట్లకు మద్దతు ఇవ్వడానికి చేరుకున్నారు. అయితే ఈ మ్యాచ్కు సంబంధించిన వీడియో ఒకటి తెరపైకి వచ్చింది, అందులో అభిమానుల మధ్యలో తీవ్ర తోపులాట జరిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్లో ఈ పోరు చోటుచేసుకుంది.
@gharkekalesh pic.twitter.com/QmnDyYgUvY
— Arhant Shelby (@Arhantt_pvt) April 29, 2023
వీడియోలో కొంతమంది అభిమానులు ఢిల్లీ క్యాపిటల్స్ జెండాను పట్టుకుని కనిపించారు. ఈ గొడవలో దాదాపు 6 మంది పరస్పరం ఘర్షణ పడ్డారు. అయితే ఈ గొడవ వెనుక గల కారణాలు ఇంకా తెలియరాలేదు. చివరికి పోలీసు సిబ్బంది గొడవను సద్దుమణిగించారు. ఈ చర్యకు సంబంధించి ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ నుండి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.