TS Govt: ఫిబ్రవరి 8న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
- By Balu J Published Date - 04:38 PM, Thu - 1 February 24
TS Govt: తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 8న షబ్-ఇ-మెరాజ్కు సెలవు ఇచ్చింది. షబ్-ఇ-మెరాజ్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హాలీడేస్ క్యాలెండర్ ప్రకారం ఆరోజు అన్ని తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు సెలవ్ ఉంటుంది. ఇది మొదట సాధారణ సెలవు కాకుండా ఐచ్ఛిక సెలవు అని ప్రభుత్వం పేర్కొంది. కానీ.. తాజాగా సాధారణ సెలవుగా మార్చింది. కాగా.. షబ్-ఇ-మెరాజ్ ను ముస్లిములు పవిత్రమైన రోజుగా భావిస్తారు. షబ్-ఇ-మెరాజ్ రోజు సందర్భంగా ముస్లింలు మసీద్ లను దీపాలతో అలంకరిస్తారు. రాత్రంతా జాగారం చేసి ప్రార్థనలు చేస్తారు.
ఫిబ్రవరి 8న సాధారణ సెలవు అని ప్రభుత్వం తాజాగా ప్రకటించడంతో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూతపడనున్నాయి. ఇక ఈ సెలవు తర్వాత ఫిబ్రవరిలో సాధారణ సెలవులు లేవు. సాధారణ పండుగలు జనవరి తర్వాత మార్చిలోనే ఉంటాయి. షబ్-ఎ-మేరాజ్ (Shab-e-Miraj) ప్రపంచంలోని అన్ని దేశాలలోని ముస్లింలు ఘనంగా జరుపుకుంటారు. ఈ ప్రత్యేక పండుగ సందర్భంగా మహమ్మదు ప్రవక్త ఆయన అనుచరులంతా రోజుకు అయిదు సార్లు నమాజ్ చెయ్యాలని ఆదేశిస్తాడట.
Related News
Kishan Reddy : ప్రజలకు వెన్నుపోటు పొడవటమే ఇందిరమ్మ రాజ్యమా?: కిషన్ రెడ్డి
Kishan Reddy: రైతుల(Farmers) పట్ల రాష్ట్ర ప్రభుత్వ(State Govt) తీరును నిరసిస్తూ బీజేపీ(bjp) రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) దీక్ష చేపట్టారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయనకు దీక్ష(Diksha)కు దిగారు. పార్టీ శ్రేణులతో కలిసి కిషన్రెడ్డి చేపట్టిన దీక్ష మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయ�