Health: ఉప్పు వాడకం గురించి మీకు ఈ విషయాలు తెలుసా
మన శరీర బరువులో 0.5% ఉప్పు ఉంటుంది. ఉప్పును తిన్నాక అది శరీరంలో చేరుతుంది.
- By Balu J Published Date - 04:38 PM, Thu - 14 December 23
Health: ఉప్పుని అధికంగా తింటే ఎంత ప్రమాదమో, పూర్తిగా తినడం మానేసినా అంతే ప్రమాదం. కాబట్టి ఉప్పును మితంగా, ఖచ్చితంగా తినాల్సిందే. ఉప్పును తినడం వల్ల మన ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మన శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలలో ఉప్పు కూడా ఒకటి. ఉప్పు అంటే సోడియం క్లోరైడ్. ఇది మన శరీరంలో కండరాల కదలికలకు, నాడుల్లో సమాచారం అందించడానికి, హృదయ స్పందనలకు, జీర్ణశక్తికి ఉపయోగపడుతుంది. ఉప్పులో 39% సోడియం ఉంటే, 61% క్లోరిన్ ఉంటుంది. మన శరీర బరువులో 0.5% ఉప్పు ఉంటుంది. ఉప్పును తిన్నాక అది శరీరంలో చేరి సోడియం, క్లోరైడ్ అయాన్లుగా విడిపోతాయి.
సోడియం కణాలు శరీరంలోని ద్రవాలను బయటికి పోకుండా లోపలే ఉంచుతాయి. దీంతో నాడులు, కండరాలు మెరుగ్గా పనిచేస్తాయి. ఎప్పుడైతే ఉప్పును తినడం మానేస్తారో శరీరంలో సోడియం శాతం పడిపోతుంది. అప్పుడు కణాలపై ఒత్తిడి పెరిగిపోతుంది. ద్రవాలు బయటికి పోయి, శరీర సమతుల్యం తప్పుతుంది.
దీనివల్ల కణాలలో నీరు నిండిపోతుంది. కణాలలో వాపు వస్తుంది. దీనివల్ల శరీరం ఉబ్బినట్టు అవుతుంది. కణాలు పగిలి ద్రవాలు బయటకు పోతాయి. అప్పుడు ప్రాణాలకే ప్రమాదం. కనుక ఉప్పును కచ్చితంగా తినాలి. ఉప్పు తినడం మానేస్తే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టే. మన శరీరానికి ఉప్పు తగినంత అందాల్సిందే. ఉప్పు అధికంగా చేరినా ప్రమాదమే, తక్కువగా చేరినా ప్రమాదమే. ఉప్పు తగ్గితే కింద పడిపోవడం, తల తిరగడం వంటివి వస్తాయి. కొన్నిసార్లు షాక్, కోమా వంటివి కూడా కలుగుతాయి.
Tags
Related News
Benefits Of MPs: దేశంలో ఎంపీలకు విలాసవంతమైన సౌకర్యాలు, అలవెన్సులు
ఎంపీగా గెలిస్తే ప్రభుత్వం అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఎంపీలు నెలవారీ జీతం రూ. 1 లక్ష, అలవెన్సులు సహా. వారి పదవీకాలం తర్వాత పెన్షన్ రూ. 50,000.