Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. క్యూలైన్స్ కిటకిట
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది.
- By Balu J Published Date - 02:33 PM, Fri - 7 April 23
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. 3 రోజుల వరుస సెలవుల నేపథ్యంలో భక్తులు పోటెత్తారు. తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుసగా మూడు రోజులు సెలవులు కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సర్వదర్శనానికి టోకెన్లు లేకుండా క్యూలైన్లలో వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. దీంతో క్యూలైన్ గోగర్భం జలాశయం వరకు చేరుకుంది. రికార్డుస్థాయిలో భక్తులు రావడంతో శ్రీవారి దర్శనం చాలా నెమ్మదిగా సాగుతోంది. చాలామంది భక్తులకు విశ్రాంతి గదులు దొరక్కపోవడంతో రేకుల షెడ్డుల కింద, తిరుమల వీధుల్లోనే ఆశ్రయం పొందారు.
Related News
Srisailam: రేపు శ్రీశైలంలో కుంభోత్సవం.. జరిగే పూజలివే
Srisailam: శ్రీశైలంలో శుక్రవారం భ్రమరాంబాదేవికి కుంభోత్సవం జరుగనున్నది. ప్రతీ సంవత్సరం చైత్రమాసంలో అమ్మవారికి సాత్వికబలిని సమర్పించేందుకు పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారాలలో (ఏరోజు ముందుగా వస్తే ఆ రోజున) ఈ ఉత్సవం నిర్వహించబడుతోంది. ఈ కుంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాత కాలపూజల అనంతరం శ్రీ అమ్మవారికి ఆలయ అర్చకులు నవావరణపూజ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుం�