Hyderabad : హైదరాబాద్లోని ఓపెన్ డ్రెయిన్లో బయటపడ్డ మొసలి ..భయాందోళనలో స్థానికులు
హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం కురిసిన వర్షంలో ఓపెన్ డ్రైన్ నుంచి మొసలి పిల్ల బయటపడింది. నగరం
- By Prasad Published Date - 07:06 AM, Thu - 28 September 23
హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం కురిసిన వర్షంలో ఓపెన్ డ్రైన్ నుంచి మొసలి పిల్ల బయటపడింది. నగరం నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్లోని చింతల్ బస్తీలోని డ్రెయిన్ నుంచి మొసలి పిల్ల బయటకు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కుండపోతగా కురుస్తున్నవర్షంలో డ్రెయిన్ నుంచి ఒక్కసారిగా మొసలి పిల్ల బయటకు రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కపడ్డారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించగా.. అటవీ శాఖాధికారులను అప్రమత్తం చేశారు. డ్రెయిన్పై వంతెన నిర్మిస్తున్న స్థలంలో సరీసృపాలు కనిపించాయి. వరద నీటిలో ఒడ్డుకు కొట్టుకువచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే మొసలిని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. నాలుగు గంటలపాటు శ్రమించిన అటవీశాఖ, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) బృందాలు, పోలీసుల సాయంతో మొసలిని పట్టుకున్నారు. అనంతరం మొసలిని నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కుకు తరలించారు.
Related News
KTR: తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు
KTR: తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో నిలిచారని, హన్మకొండ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. రాకేష్ రెడ్డి ప్రతిష్టాత్మక బిట్స్ పిలానిలో వ