HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Cpm Lambasts Govt For Neglecting Kidney Patients

Kidney Diseases : కిడ్నీ బాధితుల‌ప‌ట్ల ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంది – సీపీఎం

ఎ కొండూరు మండలంలోని పలు గ్రామాల్లో కిడ్నీ స‌మ‌స్య ప్ర‌జ‌ల్ని వెంటాడుతుంది. ఇప్ప‌టికే చాలామంది కిడ్నీ స‌మ‌స్య‌ల‌తో మ‌ర‌ణించారు

  • By Prasad Published Date - 07:41 AM, Mon - 25 July 22
  • daily-hunt
Kidney
Kidney

ఎన్టీఆర్ జిల్లా : ఎ కొండూరు మండలంలోని పలు గ్రామాల్లో కిడ్నీ స‌మ‌స్య ప్ర‌జ‌ల్ని వెంటాడుతుంది. ఇప్ప‌టికే చాలామంది కిడ్నీ స‌మ‌స్య‌ల‌తో మ‌ర‌ణించారు. అయితే కిడ్నీ వ్యాధిగ్రస్తులను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండలంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులను పరామర్శించిన సిపిఎం నాయకులు బాబురావు ఆరోపించారు. మండలంలోని చీమలపాడు హరిజనవాడ, పెద్ద తండా, చైతన్య నగర్‌ తండా గ్రామాల్లో ఆదివారం సిపిఎం నాయకులు సిహెచ్‌.బాబురావు, ఎస్‌.రామకృష్ణారెడ్డి, జెట్టి వెంకటేశ్వరరావు, ఆళ్ల అమ్మిరెడ్డి, సోమమోహన్‌రావు, ఎస్‌.సోములు, పంబి వెంకటేశ్వరరావు తదితరులు పర్యటించారు. గ్రామాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలపై సిపిఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛన్లు, ప్రభుత్వ సాయం అందడం లేదని వారు ఆరోపించారు. ప్రభుత్వం రోగులకు మంచినీరు, మందులు కూడా సరఫరా చేయడం లేదని.. తక్షణమే స్పందించి కొండూరు మండలంలో మృత్యువాత పడుతున్న ప్రజలను ఆదుకోవాలని సిపిఎం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

2022లో గత ఆరు నెలల్లో కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఇప్పటి వరకు 20 మంది చనిపోయారని, గతంలో ఎక్కువ మరణాలు జరిగాయని బాబూరావు తెలిపారు. గిరిజన తాండాలోని ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరు చనిపోయారని.. మూడేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వైసీపీ కిడ్నీ బాధితుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. కిడ్నీ వ్యాధిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైద్యారోగ్యశాఖ అధికారులతో ఒక్కసారి కూడా కనీసం సమీక్షా సమావేశం నిర్వహించలేదని, ఇది అత్యంత బాధ్యతారాహిత్యమని విమర్శించారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ చేయించుకునేందుకు ఆస్తులను అమ్ముకుంటున్నారని బాబురావు అన్నారు. చికిత్స ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామన్న హామీని సీఎం పూర్తిగా మర్చిపోయారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వలేని దయనీయ పరిస్థితిలో ప్రభుత్వం ఉంది’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మండలంలో కిడ్నీ మృతుల వివరాలను సేకరించి బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే దశలవారీగా పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. చీమలపాడు పెద్ద తండాకు చెందిన రాంబాబుకు 73 సార్లు డయాలసిస్‌ చేయించుకున్నా పింఛన్‌ మంజూరు కాలేదని బాబూరావు ఓ ప్రత్యేక కేసును ప్రస్తావించారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • A.konduru kidney patients
  • cpm
  • CPM baburao
  • kidney diseases
  • krishna district
  • ntr district

Related News

    Latest News

    • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd