Tomatoes Hijacking: రైతును బెదిరించి టమాటా ట్రక్కును హైజాక్ చేసిన దంపతులు.. పోలీసులు అదుపులో నిందితులు..!
కర్నాటకలో రైతును బెదిరించి 2 వేల కిలోల టమాటా ట్రక్కును దోచుకెళ్లిన (Tomatoes Hijacking) దంపతులను పోలీసులు అరెస్ట్ చేసిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది.
- By Gopichand Published Date - 02:18 PM, Sun - 23 July 23

Tomatoes Hijacking: కర్నాటకలో రైతును బెదిరించి 2 వేల కిలోల టమాటా ట్రక్కును దోచుకెళ్లిన (Tomatoes Hijacking) దంపతులను పోలీసులు అరెస్ట్ చేసిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. దేశవ్యాప్తంగా టమాట ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో ఈ విషయం తెరపైకి వచ్చింది. అరెస్టయిన నిందితులను భాస్కర్, అతని భార్య సింధూజగా గుర్తించారు.
అసలు ఏం జరిగిందీ..?
ఈ మొత్తం వ్యవహారం బెంగళూరులోని చిక్కజాల సమీపంలోని RMC యార్డ్ పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగింది. రైతు కోలార్ మార్కెట్కు టమాటాలు తీసుకెళ్తుండగా దుండగులు టమాటాను గమనించిన వెంటనే, ముఠా వాహనాన్ని వెంబడించారు. అగంతకులు ముందుగా వాహనాన్ని ఆపి డ్రైవర్తో గొడవకు దిగారు. రైతును బెదిరించిన దుండగులు అతడిని బయటకు నెట్టివేసి టమాటా లారీతో పరారయ్యారు. నిందితులు చెన్నై వెళ్లి టమోటాలను విక్రయించారు.
Also Read: Diet Charges Hike: విద్యార్థులకు శుభవార్త…డైట్ చార్జీల ఫైల్ పై సంతకం చేసిన సీఎం కేసీఆర్
ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు
ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ.. అరెస్టయిన దంపతులను భాస్కర్, అతని భార్య సింధూజగా గుర్తించారు. దీంతో పాటు రాకీ, కుమార్, మహేష్ అనే ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు. ట్రక్కు హైజాక్ అయినప్పుడు టమోటాల సరుకును కోలార్కు డెలివరీ చేయాల్సి ఉందని పోలీసులు చెప్పారు. ఈ ఘటన జూలై 8న జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇది మాత్రమే కాదు దుండగులు ఇంతకుముందు కూడా రైతు నుండి డబ్బు డిమాండ్ చేశారు. ఆన్లైన్ మొబైల్ ఫోన్లో డబ్బును కూడా బదిలీ చేశారు. రుతుపవనాలు, ఇతర వాతావరణ సంబంధిత కారణాల వల్ల దేశంలో ఈ సమయంలో టమోటాలు చాలా ఖరీదైనవిగా మారుతున్నాయి.