HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Congress Says Wont Attend Ram Temple Event In Ayodhya

Congress – Ayodhya : అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్లం : కాంగ్రెస్

Congress - Ayodhya : అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి తాము హాజరుకాబోమని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

  • By Pasha Published Date - 04:40 PM, Wed - 10 January 24
  • daily-hunt
Congress Ayodhya
Congress Ayodhya

Congress – Ayodhya : జనవరి 22న జరిగే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి తమ పార్టీ నేతలు హాజరుకాబోరని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ కార్యక్రమం బీజేపీ, దాని సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) యొక్క రాజకీయ ప్రాజెక్టులా మారిందని వ్యాఖ్యానించింది. అయోధ్య రామమందిరం ఆహ్వానం అందుకున్న తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,  అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరి ఈ కార్యక్రమానికి హాజరుకాబోరని(Congress – Ayodhya) స్పష్టం చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

‘‘మతం అనేది వ్యక్తిగత విషయం. కానీ ఆర్ఎస్ఎస్, బీజేపీలు చాలా కాలంగా అయోధ్యలో ఆలయ నిర్మాణాన్ని రాజకీయ ప్రాజెక్టుగా తయారుచేశాయి. ఆలయ నిర్మాణ పనులు పూర్తి కాకముందే.. బీఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ నాయకులు హడావుడిగా రామమందిరాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నది ఎన్నికల్లో లాభం పొందడం కోసమే’’ అని కాంగ్రెస్ ఆరోపించింది. 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును,  శ్రీరాముడిని గౌరవించే కోట్లాది మంది మనోభావాలను కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుందని తేల్చి చెప్పింది. మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, అధీర్ రంజన్ చౌదరిలు ఈ కార్యక్రమానికి అందిన ఆహ్వానాలను తిరస్కరించారని హస్తం పార్టీ వెల్లడించింది. ఈమేరకు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

Also Read: Target 400 : విపక్షల ఎంపీలపై బీజేపీ ఆకర్ష్ మిషన్.. ‘జాయినింగ్ కమిటీ’ ఏర్పాటు

రాహుల్‌ గాంధీ జనవరి 14 నుంచి ప్రారంభించాల్సిన ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’కు అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ యాత్రకు మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. మణిపూర్ పీసీసీ అధ్యక్షుడు కె.మేఘచంద్ర పార్టీ నాయకులతో కలిసి బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ను కలిశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకొని అక్కడ రాహుల్‌ యాత్రకు అనుమతి ఇవ్వలేమని ముఖ్యమంత్రి వారికి వెల్లడించారు. రాహుల్‌ యాత్రకు అనుమతుల విషయంలో తమ ప్రభుత్వం పూర్తిగా భద్రతా సంస్థల నివేదికలపైనే ఆధారపడిందని సీఎం మంగళవారం వెల్లడించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటం చాలా సంక్లిష్టంగా మారిందన్నారు. ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ జనవరి 14న మొదలై మార్చి 30న ముగుస్తుంది. 66 రోజులపాటు 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా దాదాపు 6,713 కిలోమీటర్ల పాటు కొనసాగనుంది. మణిపూర్, అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌, అస్సాం, మేఘాలయ, పశ్చిమబెంగాల్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్రల్లో ఈ యాత్ర జరుగుతుంది. వచ్చే ఎన్నికల కోసం పార్టీ క్యాడర్‌ను యాక్టివేట్ చేసేందుకు ఈ యాత్ర దోహదం చేస్తుందని  కాంగ్రెస్ భావిస్తోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ayodhya Ram Mandir
  • congress
  • Congress - Ayodhya
  • Ram Temple Event

Related News

CM Revanth Reddy

Revanth Reddy : నేను ఎవరి వెనుకా లేను..మీ కుటుంబ పంచాయితీలోకి మమ్మల్ని లాగొద్దు : సీఎం రేవంత్‌రెడ్డి

కవిత చెబుతున్నట్టు నేను ఆమె వెనుక ఉన్నానంటారు. ఇంకొందరు హరీశ్ రావు, సంతోష్ వెనుక ఉన్నానంటున్నారు. ఈ రాజకీయ పంచాయితీలు ప్రజలకు అవసరం లేదు. నన్ను మీ కుటుంబ, కుల రాజకీయాల్లోకి లాగొద్దు అని రేవంత్ స్పష్టంగా అన్నారు.

  • CM Revanth Reddy

    CM Revanth Reddy: రేపు కామారెడ్డి జిల్లాకు సీఎం రేవంత్‌.. షెడ్యూల్ ఇదే!

  • Kavitha

    Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి కవిత రాజీనామా!

  • KCR model is needed for agricultural development in the country: KTR

    KTR : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత కేటీఆర్ సవాల్

  • Ktr Assembly

    KTR : రాహుల్‌గాంధీ కంటే ముందే కులగణన చేయాలని చెప్పింది బీఆర్‌ఎస్సే

Latest News

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

  • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd