HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Aiming For 400 Seats Bjp Sets Up Panel To Recruit Opposition Mps

Target 400 : విపక్షల ఎంపీలపై బీజేపీ ఆకర్ష్ మిషన్.. ‘జాయినింగ్ కమిటీ’ ఏర్పాటు

Target 400 : త్వరలో జరగనున్న ఎన్నికల్లో దేశంలోని 543 లోక్‌సభ స్థానాలకుగానూ 400 గెలవాలనే బలమైన సంకల్పంతో బీజేపీ పావులు కదుపుతోంది.

  • By Pasha Published Date - 04:02 PM, Wed - 10 January 24
  • daily-hunt
Modi Toopran
Modi Toopran

Target 400 : త్వరలో జరగనున్న ఎన్నికల్లో దేశంలోని 543 లోక్‌సభ స్థానాలకుగానూ 400 గెలవాలనే బలమైన సంకల్పంతో బీజేపీ పావులు కదుపుతోంది. ఇందుకోసం వినూత్న రాజకీయ వ్యూహాలను రెడీ చేస్తోంది. ప్రత్యేకించి విపక్ష పార్టీలలోని బలమైన ఎంపీలను ఆకర్షించేందుకు బీజేపీ ప్రణాళికలను సిద్ధం చేస్తోందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇందుకు అవసరమైన అన్ని రకాల మార్గాలను వాడుకోవాలని కమలదళం యోచిస్తోందని ఆ కథనాల్లో ప్రస్తావించారు. ఎన్నికల వ్యూహరచనపై  మంగళవారం ఢిల్లీలో బీజేపీ ఒక ముఖ్యమైన సమావేశం నిర్వహించింది. ఇతర పార్టీల ఎంపీలను బీజేపీలోకి తీసుకొచ్చే మిషన్‌తో ముడిపడిన  కీలక బాధ్యతలను పార్టీ ప్రధాన కార్యదర్శులకు ఈసందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అప్పగించారని తెలిసింది. విపక్ష ఎంపీల చేరికకు సంబంధించిన జాయినింగ్ కమిటీ బాధ్యతలను బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేకు అప్పగించారని సమాచారం.  ‘‘జాయినింగ్ కమిటీ ఇతర పార్టీల నుంచి ప్రభావవంతమైన నాయకులు, సిట్టింగ్ ఎంపీలను బీజేపీలోకి తీసుకురావడానికి గల అవకాశాలను అన్వేషిస్తుంది. నియోజకవర్గంలో నాయకుడి ప్రభావం, ఎన్నికల్లో గెలవగల సామర్థ్యం ఆధారంగా చేరికలపై నిర్ణయం తీసుకుంటుంది’’ అని బీజేపీ వర్గాలు(Target 400) తెలిపాయి.

We’re now on WhatsApp. Click to Join.

2019 లోక్‌సభ ఎన్నికల్లో కోల్పోయిన 160 సీట్లపై  బీజేపీ ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టింది. 1984లో రాజీవ్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ లోక్‌సభలో తొలిసారిగా 400కుపైగా సీట్లను సాధించింది. వచ్చే ఎన్నికల్లో ఆ రికార్డును అధిగమించాలనే లక్ష్యంతో బీజేపీ సన్నాహాలు చేస్తోంది.ఇక  2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించే బాధ్యతను పార్టీ ప్రధాన కార్యదర్శి రాధామోహన్ దాస్ అగర్వాల్‌కు అప్పగించారు. ఎన్నికల ప్రచారం, ప్రచార సంబంధిత పనులను సునీల్ బన్సల్, ఇతర ప్రధాన కార్యదర్శులు పర్యవేక్షిస్తారు. దుష్యంత్ గౌతమ్ దేశవ్యాప్తంగా బౌద్ధుల సదస్సులను నిర్వహించి, నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపడుతున్న పనుల గురించి వారికి చెబుతారు.

Also Read: Lord Sri Ram : ఇంట్లో రాముడి ఫొటో పెట్టేందుకు వాస్తు నియమాలివీ..

మంగళవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ సమావేశంలో పార్టీ చీఫ్ జేపీ నడ్డాతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శులు, కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, అశ్విని వైష్ణవ్, మన్సుఖ్ మాండవ్య పాల్గొన్నారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. మరోవైపు ఇండియా కూటమి సీట్ల పంపకాలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌లలో సీట్ల సర్దుబాటుపై ఆమ్ ఆద్మీ పార్టీతో చర్చలు జరిపింది. ఇక మహారాష్ట్రలో సీట్ల సర్దుబాటుపై శివసేన, ఎన్సీపీలతో చర్చలు జరిపింది. మహారాష్ట్రలో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చిందని తెలుస్తోంది. ఈ రాష్ట్రంలో సీట్ల పంపకాలపై ఇండియా కూటమి నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • Opposition MPs
  • pm modi
  • Target 400

Related News

PM Modi

PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా శనివారం (సెప్టెంబర్ 6) పీఎం మోదీతో మాట్లాడిన తర్వాత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఒక పోస్ట్ షేర్ చేశారు.

  • Tensions in India-US relations: Modi absent from UN meetings!

    PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

  • Minister Lokesh meets Prime Minister Modi..these are the topics discussed..!

    Lokesh Delhi Tour : ప్రధాని మోడీతో మంత్రి లోకేష్ భేటీ..చర్చించిన అంశాలివే..!

  • New GST

    New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

  • Small chip made in India has the power to change the world: PM Modi

    PM Modi : భారత్ తయారు చేసిన చిన్న చిప్ ప్రపంచాన్ని మార్చే శక్తి కలిగి ఉంది: ప్రధాని మోడీ

Latest News

  • Team India Jersey: టీమిండియా న్యూ జెర్సీ చూశారా? స్పాన్సర్‌షిప్ లేకుండానే బ‌రిలోకి!

  • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

  • BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదే!

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd