Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Speed-news News
  • ⁄Cong Protest In Hyderabad Turns Violent Several Arrested

TPCC : హింసాత్మ‌కంగా టీకాంగ్రెస్ రాజ్ భ‌వ‌న్ ముట్ట‌డి.. నేత‌ల‌పై కేసులు న‌మోదు

  • By Vara Prasad Published Date - 09:11 PM, Thu - 16 June 22
TPCC : హింసాత్మ‌కంగా టీకాంగ్రెస్ రాజ్ భ‌వ‌న్ ముట్ట‌డి.. నేత‌ల‌పై కేసులు న‌మోదు

గురువారం రాజ్‌భవన్‌ ముట్టడికి కాంగ్రెస్‌ పిలుపునివ్వడంతో ఉద్రిక్తత నెలకొంది. రాజ్‌భవన్‌కు వెళ్లే మార్గాలను పోలీసులు అడ్డుకోవడంతో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ద్విచక్ర వాహనానికి నిప్పంటించారు. ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. వారిని శాంతింపజేసి దారి తీయడానికి ప్రయత్నించిన పోలీసులతో తెలంగాణా కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగడం నిరసనలు కనిపించాయి. కాంగ్రెస్‌ నాయకురాలు రేణుకా చౌదరిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎస్ ఐ కాల‌ర్‌ పట్టుకున్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క, గీతారెడ్డి తదితర నేతలను అరెస్టు చేసి నగరంలోని వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. పార్టీ అధినేత రాహుల్ గాంధీని ఇడి వేధింపులకు గురిచేస్తోందనినిరసిస్తూ రాజ్‌భవన్‌ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) పిలుపు మేరకు రాజ్‌భవన్‌ పరిసరాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజ్‌భవన్‌ చుట్టూ ఆందోళనకారులు గుమికూడకుండా భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. పంజాగుట్టలోని రాజీవ్‌గాంధీ విగ్రహం నుంచి రాజ్‌భవన్‌ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అయితే రాజ్‌భవన్‌ వద్ద ర్యాలీకి, నిరసనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఆందోళనకారులు అక్కడికి చేరుకోకుండా రాజ్‌భవన్‌ వైపు వెళ్లే రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిర‌స‌న‌లో పాల్గొన్న వారిపై పోలీసులు కేసులు న‌మోదు చేశారు. ప్ర‌భుత్వ‌, ప్ర‌వేట్ ఆస్తులు ధ్వ‌సం చేసినందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భ‌ట్టితో పాటు ప‌లువురి నేత‌ల‌పై కేసులు న‌మోదు చేశారు.

Tags  

  • congress
  • hyderabad
  • rajbhavan
  • revanth reddy
  • TCongress
  • tpcc

Related News

Amit Shah: వచ్చే 30 – 40 ఏళ్లు అధికారం బీజేపీదే.. భారత్ విశ్వగురు అవుతుంది : అమిత్ షా

Amit Shah: వచ్చే 30 – 40 ఏళ్లు అధికారం బీజేపీదే.. భారత్ విశ్వగురు అవుతుంది : అమిత్ షా

జాతీయ కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ దూకుడు మీదుంది. అందుకే అది మాట్లాడే ప్రతి మాటలోనూ ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది.

  • Modi @Hyd : నేడు బీజేపీ విజ‌య్ సంక‌ల్ప స‌భ…  భారీగా ఏర్పాట్లు చేసిన బీజేపీ

    Modi @Hyd : నేడు బీజేపీ విజ‌య్ సంక‌ల్ప స‌భ… భారీగా ఏర్పాట్లు చేసిన బీజేపీ

  • Modi Arrives Hyderabad: ప్రధాని మోడీకి ఘన స్వాగతం

    Modi Arrives Hyderabad: ప్రధాని మోడీకి ఘన స్వాగతం

  • Yashwant Sinha:దేశానికి కేసీఆర్ అవసరమన్న యశ్వంత్ సిన్హా.. మరి రాహుల్, రేవంత్ పరిస్థితి ఏమిటి?

    Yashwant Sinha:దేశానికి కేసీఆర్ అవసరమన్న యశ్వంత్ సిన్హా.. మరి రాహుల్, రేవంత్ పరిస్థితి ఏమిటి?

  • JP Nadda: బీజేపీ జాతీయ సమావేశాలకు నడ్డా శ్రీకారం!

    JP Nadda: బీజేపీ జాతీయ సమావేశాలకు నడ్డా శ్రీకారం!

Latest News

  • Gym: ఇంటర్నెట్లో క్లిక్ కొట్టు.. ఇంట్లోనే ఫిట్నెస్ పై పట్టు!!

  • Taapsee: నన్ను నేను గిల్లి మరీ చెక్ చేసుకుంటున్నా.. షారుఖ్ తో “డంకీ”పై తాప్సీ

  • Skanda Panchami : నేడు స్కందపంచమి…ఈ పరిహారాలు చేస్తే పెళ్లి అడ్డంకులు తొలగిపోతాయి..!!

  • Amarnath Yatra: ప్రశాంతంగా సాగుతున్న అమరనాథ్ యాత్ర.. 200 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో గస్తీ

  • PM Modi : మోదీ నోట భాగ్యనగర్ మాట…పేరు మార్పుపై మొదలైన చర్చ..!!

Trending

    • Viral Video : మొసలితో మేయర్ మ్యారేజ్!

    • Viral video : కాళ్లకు చెప్పులు లేకుండా మండుటెండలో రిక్షావాలా.. కొత్త చెప్పులిచ్చిన కానిస్టేబుల్ !

    • BJP Then and Now: 2004లోనూ హైదరాబాద్ లోనే బీజేపీ సమావేశాలు.. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటి?

    • Clouds on Mars: మార్స్ పైన మేఘాలని కనిపెట్టండి.. నాసా పోస్ట్ వైరల్!

    • Alimony: హింసించిన భార్య.. 83 ఏళ్ళ భర్తకు భార్య భరణం ఇవ్వాలంటూ కోర్టు తీర్పు!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: