Commonwealth Games: 2026 కామన్వెల్త్ క్రీడల నిర్వహణపై సందిగ్ధత.. బడ్జెట్ పెరుగుదలే కారణమా..?
2026లో ఆస్ట్రేలియాలో జరగనున్న కామన్వెల్త్ క్రీడల (Commonwealth Games) నిర్వహణపై సందిగ్ధత నెలకొంది.
- By Gopichand Published Date - 10:05 AM, Tue - 18 July 23
Commonwealth Games: 2026లో ఆస్ట్రేలియాలో జరగనున్న కామన్వెల్త్ క్రీడల (Commonwealth Games) నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. బడ్జెట్లో పెరుగుదల కారణంగా విక్టోరియా ప్రభుత్వం ఇప్పుడు ఈ గేమ్లను నిర్వహించడానికి నిరాకరించింది. జులై 18న అక్కడి ప్రభుత్వం ఇచ్చిన సమాచారంలో ఈ క్రీడల నిర్వహణకు బడ్జెట్ రెట్టింపు కావడం వల్ల పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోతున్నామని తెలిపారు.
కామన్వెల్త్ గేమ్స్ 2026లో 20కి పైగా ఈవెంట్లు నిర్వహించాల్సి ఉంది. ఇందులో 5 వేలకు పైగా అథ్లెట్లు పాల్గొంటారు. విక్టోరియా ప్రీమియర్ డేనియల్ ఆండ్రూస్ ఈ ఈవెంట్కు ఆతిథ్యం ఇవ్వడానికి కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ ద్వారా గత సంవత్సరం మమ్మల్ని సంప్రదించినట్లు తన నిర్ణయం గురించి విలేకరుల సమావేశంలో తెలియజేశారు.
గత సంవత్సరం మేము దీనిని హోస్ట్ చేసినప్పుడు ఆ సమయంలో ఈ క్రీడల నిర్వహణకు సుమారు రూ. 15,000 కోట్లు అంచనా వేయగా, మేము దాని కోసం సిద్ధం చేయడం కోసం ప్రారంభించాం. ఇప్పుడు ప్రస్తుత వ్యయం రూ. 34,000 కోట్లకు పెరిగిందని ప్రీమియర్ చెప్పారు. అందువల్ల, దీనిని నిర్వహించకూడదని నిర్ణయం తీసుకొని, మేము ఈ నిర్ణయం గురించి ఫెడరేషన్కు కూడా తెలియజేసాము. ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాం. స్కూల్, హాస్పిటల్ డబ్బు తగ్గించి ఆర్గనైజ్ చేయలేం అని తెలిపారు.
Also Read: Wicket-Keeper: వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా వికెట్ కీపర్ ఎవరో..? అందరి చూపు ఈ ఆటగాళ్ల పైనే..!
నిర్ణయంపై ఫెడరేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది
ఇప్పటి వరకు 5 సార్లు కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇచ్చిన ఆస్ట్రేలియాపై కామన్వెల్త్ ఫెడరేషన్ కూడా నిరాశను వ్యక్తం చేసింది. విక్టోరియా ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించి, ఈ నిర్ణయం తీసుకునే ముందు వారు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఫెడరేషన్ తెలిపింది. జూన్లో జరిగిన సమావేశంలో బడ్జెట్ రూ.15 వేల కోట్లు కాగా, ఇప్పుడు రెట్టింపుగా చెబుతున్నారు. అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
Related News
Mall : మాల్లో కత్తిపోట్ల కలకలం.. నలుగురి మృతి!
Sydney mall: ఆస్ట్రేలియా(Australia) రాజధాని సిడ్నీ(Sydney)లోని ఓ షాపింగ్ మాల్(Shopping mall)లో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లు, పలువురు గాయపడ్డట్టు సమాచారం. సిడ్నీలోని బోండీ జంక్షన్ పరిధిలో గల వెస్ట్ఫీల్డ్ మాల్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయినట్లు బీఎన్ఓ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. We’re now on WhatsApp. Click to Join. BREAKING: Multiple people injured in stabbing at Westfield Bo