Adilabad: ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా.. వణుకుతున్న ప్రజలు
- By Balu J Published Date - 03:36 PM, Tue - 19 December 23
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం చల్లటి వాతావరణం నెలకొంది. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం, ఆదిలాబాద్ జిల్లాలో వాస్తవ కనిష్ట ఉష్ణోగ్రత 11.7 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. బేల మండలంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 9.4 డిగ్రీల సి నమోదైంది. కుమ్రం భీం ఆసిఫాబాద్లో వాస్తవ కనిష్ట ఉష్ణోగ్రత 13.8 డిగ్రీలుగా నమోదైంది. సిర్పూర్ మండలంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 10.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.
ఇదిలా ఉండగా నిర్మల్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత 15.8 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. పెంబి మండలంలో కనిష్ట ఉష్ణోగ్రత 11.0 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. మంచిర్యాల జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత 16.3 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. భీమిని మండలంలో అత్యల్ప ఉష్ణోగ్రత 14.8 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. వృద్ధులు, పిల్లలకు కష్టంగా మారింది.
Tags
Related News
KTR: బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు రద్దు
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తూ రాజ్యాంగ సవరణ చేస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే ఈ మాట నేను చెప్పడం లేదని, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎంపీలు చెబుతున్నారని ఆయన అన్నారు.