HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Cm Revanth Reddy Initiates Rainwater Harvesting And Urban Development Projects

CM Revanth Reddy : ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా వరద నీటి సంపుల నిర్మాణం.. శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy : సీఎం రేవంత్‌ రెడ్డి ప్రజా పాలన విజయోత్సవంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హై సిటీ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. దాదాపు రూ. 3667 కోట్ల విలువైన అభివృద్ధి పనులను శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

  • Author : Kavya Krishna Date : 03-12-2024 - 11:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad
Hyderabad

CM Revanth Reddy : ప్రజా పాలన విజయోత్సవం సందర్భంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హై సిటీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. దాదాపు రూ. 3667 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన , ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో రూ. 3500 కోట్లతో ఫ్లై ఓవర్లు, రహదారుల పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు, అలాగే పలు జంక్షన్లలో రూ. 1.50 కోట్ల బ్యూటిఫికేషన్ పనులకు ప్రారంభోత్సవం జరగనుంది. అంతేకాక, రూ. 16.50 కోట్లతో నిర్మిస్తున్న రైన్ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్‌లో పూర్తి చేసిన వాటిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం కేబీఆర్ పార్క్ చుట్టూ ఆరు ఫ్లైఓవర్లు, అండర్ పాసులు నిర్మించే పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం హై సిటీ ప్రాజెక్టు ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది, వాటిలోని మరిన్ని పనులు ఇవాళ ఐమాక్స్ పక్కన హెచ్ఎండీఏ గ్రౌండ్లో ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.

Student Suicide : నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

ప్రజాపాలన విజయోత్సవం భాగంగా, వరద నీటి సంపుల నిర్మాణం కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. సచివాలయం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం హైదరాబాద్‌ వ్యాప్తంగా 12 ప్రాంతాల్లో జరుగుతుంది. ఒక్కో సంపు సామర్థ్యం 1 లక్ష నుండి 10 లక్షల లీటర్ల వరకు ఉంటుంది, , వరద నీటిని రోడ్ల మీద నుంచి సంపులోకి పంపించి కాలువల ద్వారా మళ్లించడమే టార్గెట్. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని సర్కిళ్లలో పారిశుధ్య కార్మికులకు హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నారు. అన్ని రకాల స్క్రీనింగ్ టెస్టులు చేయనున్నారు. వీటితో పాటు కార్మికులకు పీపీఈ కిట్లను అందజేయనున్నారు. 2కే రన్ సైతం నిర్వహించనున్నారు.

ఇదిలాఉంటే…. వర్షాల సమయంలో రోడ్డుపై చేరే వరదను సమర్థవంతంగా మళ్లించగలిగితే, వరదల వల్ల ఏర్పడే ట్రాఫిక్ జామ్‌లను తగ్గించవచ్చని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథిగృహం వద్ద వరద నివారణ కోసం నిర్మించనున్న వాన నీటి సంపుల పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వాన నీటి సంపుల డిజైన్‌లను మార్చాలని సీఎం అధికారులకు సూచించారు. హైదరాబాద్‌లోని 141 వరదప్రమాద స్థలాల వద్ద వాన నీటి సంపులు నిర్మించాలని, వచ్చే వానాకాలం నాటికి అన్నీ పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. వరద నివారణ చర్యల విషయంలో అధికారులు తీసుకోవాల్సిన తదుపరి కార్యక్రమాలపై కూడా సీఎం పలు సూచనలు చేశారు.

Narendra Modi : ప్రతి భారతీయుడికి సత్వర న్యాయం జరిగేలా మా ప్రయత్నాల్లో ప్రత్యేక రోజు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • Flood Management
  • Greater Hyderabad
  • hyderabad
  • infrastructure development
  • Public Administration
  • Rainwater Harvesting
  • telangana government
  • traffic control
  • urban development

Related News

International Thalassemia Day

Nara Bhuvaneswari: ‘తలసేమియా రన్’ వ్యాధిపై అవగాహన కల్పించి చిన్నారులు అండగా నిలవాలని నారా భువనేశ్వరి

తలసేమియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆదివారం హైదరాబాద్‌లో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరంలోని నెక్లెస్ రోడ్డులో ‘తలసేమియా రన్’ను ఘనంగా నిర్వహించింది. జలవిహార్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. ఈ పరుగులో 3K, 5K, 10K విభా

  • Retired IPS Officer Wife Incident in Jubilee Hills

    Hyderabad: జూబ్లీహిల్స్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య

  • Changing the Names of Several Castes: Telangana Government Takes Key Decision

    Telangana Castes: పలు కులాల పేర్లను మారుస్తూ.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

  • New Policy on Fee Reimbursement in Telangana

    Telangana Fee Reimbursement: తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కొత్త పాలసీ!

  • Another Metro Phase 3 in Hyderabad

    హైదరాబాద్ లో మరో మెట్రో ఫేజ్-3.. కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి

Latest News

  • Rashmi Gautam: మోదీపై రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు

  • Diabetes: ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి? శరీరంలో వచ్చే మార్పులు ఇవే…

  • Trisha: ప్రేమ‌కు కృత‌జ్ఞ‌త‌లు.. త్రిష పోస్ట్ వైరల్..!

  • Nara Lokesh: సింగపూర్ పర్యటనలో మంత్రి నారా లోకేశ్‌

  • PM Modi: బంగారం కొనొద్దు.. అసలు కారణాలు ఏంటో తెలుసా…?

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd