PM Invitation: ప్రధాని కార్యక్రమానికి రండి… కేంద్రం నుంచి కేసీఆర్ కు ఆహ్వానం
రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా యుద్ద వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరఫునుంచి కేసీఆర్ కు వినూత్నంగా ఆహ్వానం అందింది.
- By Hashtag U Published Date - 09:50 AM, Thu - 10 November 22
రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా యుద్ద వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరఫునుంచి కేసీఆర్ కు వినూత్నంగా ఆహ్వానం అందింది. ఈనెల 12న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ రీ ఓపెన్ కానుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కీలక చర్చ తెరపైకి వచ్చింది. తెలంగాణలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ వెళ్తారా అనే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో కీలక పరిణామం జరిగింది. కేంద్రం నుంచి కేసీఆర్కు ఆహ్వానం వచ్చింది. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి సహకరించాలని.. కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవియ కేసీఆర్కు లేఖ రాశారు.
అయితే.. కేంద్రమంత్రి రాసిన లేఖపై కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మోదీ తెలంగాణ టూర్పై ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. విభజన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తోంది. తెలంగాణ మేథావులు కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారు. అటు ప్రధాని టూర్ను అడ్డుకుంటామని ఇప్పటికే లెఫ్ట్ పార్టీలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో.. కేంద్రమంత్రి లేఖ రాయడం హాట్ టాపిక్గా మారింది. ఒకవేళ కేసీఆర్ ఈ కార్యక్రమానికి వెళ్తే.. లెఫ్ట్ పార్టీల వైఖరి, టీఆర్ఎస్ వైఖరి ఎలా ఉంటుందన్నది ఇంట్రెస్టింగ్గా మారింది.
Related News
Telangana BJP : తెలంగాణలో బీజేపీకి డబుల్ డిజిటా.. సాధ్యమేనా..?
దేశ వ్యాప్తంగా ఎన్నికల జాతర జరుగుతోంది. మరోమారు అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ఊవిళ్లూరుతోంది.