Jagan vs Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ను కాదని జగన్ వేస్తున్న స్కెచ్ లు బెడిసికొడుతున్నాయా? వైసీపీకి పీకేనే దిక్కా?
2014 ఎన్నికల్లో ఓటమి తరువాత వైసీపీ అధినేత జగన్.. ప్రశాంత్ కిషోర్ తో జట్టు కట్టారు. ఎన్నికల వ్యూహకర్తగా అప్పటికే కేంద్రంలో కాంగ్రెస్ ను ఓడించి బీజేపీని గెలిపించిన అనుభవం ఆయనకు ఉంది. అందుకే జగన్ పీకేను నమ్మారు.
- By Hashtag U Published Date - 11:59 AM, Sat - 23 April 22
2014 ఎన్నికల్లో ఓటమి తరువాత వైసీపీ అధినేత జగన్.. ప్రశాంత్ కిషోర్ తో జట్టు కట్టారు. ఎన్నికల వ్యూహకర్తగా అప్పటికే కేంద్రంలో కాంగ్రెస్ ను ఓడించి బీజేపీని గెలిపించిన అనుభవం ఆయనకు ఉంది. అందుకే జగన్ పీకేను నమ్మారు. దానికి తగ్గట్టే.. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని సోషల్ మీడియా ప్రచారం ద్వారా ముప్పుతిప్పలు పెట్టారు పీకే. జగన్ ను హీరోగా నిలబెట్టేలా వ్యూహాలు రచించారు. విజయాలు సాధించారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ కు పీకే సేవలు అందడం లేదు. దానికన్నా.. పీకే సేవలను జగనే వద్దనుకున్నారు అనడం కరెక్ట్. దానికి ఒకటే కారణం.
ఎన్నికల్లో వ్యూహాలు రచించి ఇచ్చేందుకు.. వాటిని సమర్థవంతంగా అమలు చేసేందుకు పీకే ఫీజు కోట్లలో ఉంటుందని టాక్. పవర్ లోకి రాకముందు అంటే ఓకే. ఎలాగూ అధికారంలోకి వచ్చేశాం కదా అని పీకే సేవలను లైట్ తీసుకుంది వైసీపీ. దానికి బదులుగా జగన్ తన సొంత వ్యూహాలనే అమలు చేయడానికి సిద్ధపడ్డారు. కానీ ఇది అంతగా వర్కవుట్ కాలేదని ప్రస్తుత పరిణామాలను చూస్తే అర్థమవుతోంది.
2019లో అధికారంలోకి వచ్చిన తరువాత ఓ ఏడాది పాటు ప్రభుత్వానికి పరిస్థితులన్నీ అనుకూలంగానే ఉన్నాయి. కానీ ఏడాదిలోపే కరోనా రావడం వల్ల మరో రెండేళ్లపాటు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షాలు సరైన పోరాటం చేయలేకపోయాయి. ఎప్పుడైతే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం చేశారో.. అదిగో అప్పుడు జగన్ కు రాజకీయపార్టీలో సవాళ్లు ఎలా ఉంటాయో తెలిసొచ్చింది. కానీ వాటిని పరిష్కరించడానికి చాలా కష్టపడాల్సి వస్తోంది.
అసమ్మతి సెగలు ఎక్కడ రాజుకుంటున్నాయో.. గతంలో పీకే ముందు చెప్పేవారు. దానిని ఎలా సరిదిద్దుకోవాలో సలహాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు దానికోసం ఎవరూ లేరు. పీకే సేవలను కూడా ఉపయోగించుకోవట్లేదని టాక్. అందుకే జగన్ పై అసమ్మతి స్వరం పెరిగిందని.. సకాలంలో అలాంటివారిని గుర్తించి.. ఆ పరిస్థితిని ముందే చక్కదిద్దే అవకాశం లేకపోయిందని టాక్. అయితే జగన్ కూడా తన స్వంత వ్యూహాలనే అమలు చేయడానికి ఇష్టపడుతున్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశంపార్టీ పూర్తిస్థాయిలో పోరాటానికి దిగిన వేళ.. పీకే సేవలను జగన్ మళ్లీ ఉపయోగించుకుంటారో లేదో చూడాలి.
Related News
AP Politics : ప్రశాంత్ కిషోర్ అంచనాలు వైసీపీలో గుబులు పెంచుతున్నాయా..?
2019 ఏపీ ఎన్నికల్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎంత మేర వైసీపీ గెలుపు కృషి చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో వైసీపీ అధికారంలోకి వచ్చింది.