Telangana : తెలంగాణలో నేడు 32 జ్యుడీషియల్ కోర్టులు ప్రారంభం
తెలంగాణ హైకోర్టు ఆవరణలో గురువారం సాయంత్రం 5 గంటలకు 32 జ్యుడీషియల్ కోర్టులను భారత ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణ, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
- By Hashtag U Published Date - 09:17 AM, Thu - 2 June 22
తెలంగాణ హైకోర్టు ఆవరణలో గురువారం సాయంత్రం 5 గంటలకు 32 జ్యుడీషియల్ కోర్టులను భారత ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణ, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్రశర్మ, హైకోర్టు న్యాయమూర్తులు ఈ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం ఉదయం 9.30 గంటలకు హైకోర్టులో సీజే సతీష్ చంద్రశర్మ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి న్యాయవాదులు మరియు బార్ అసోసియేషన్ సభ్యులందరూ హాజరు కావాలని రిజిస్ట్రార్ జనరల్ కె సుజన పిలుపునిచ్చారు.
Related News
BRS : ఆ ఇద్దరి ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు..
అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ తరుపున గెలిచిన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి , అలాగే జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది