Chittoor:మంత్రి పెద్దిరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన చిత్తూరు టీడీపీ నేతలు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. డబ్బు గర్వంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మాట్లాదితే సహించబోమని పుంగనూరు టిడిపి ఇంఛార్జి చల్లా రామచంద్రా రెడ్డి హెచ్చరించారు.
- By Hashtag U Published Date - 10:00 PM, Sun - 9 January 22
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. డబ్బు గర్వంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మాట్లాదితే సహించబోమని పుంగనూరు టిడిపి ఇంఛార్జి చల్లా రామచంద్రా రెడ్డి హెచ్చరించారు. ఆదివారం తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నివాసంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ నేతలు పెద్దిరెడ్డి పై ఫైర్ అయ్యారు. పెద్దిరెడ్డి ముందు పుంగనూరులో గెలిచి, కుప్పం గూర్చి మాట్లాడాలని టీడీపీ నేతలు సవాలు విసిరారు. వచ్చే ఎన్నికల్లో పెద్దిరెడ్డిని పుంగనూరులో చిత్తు చిత్తుగా ఓడిస్తామన్నారు. అవినీతి, అక్రమ మార్గాలలో వేలకోట్లు గడించిన డబ్బుతో పెద్దిరెడ్డికి మధమెక్కిందని ఆరోపించారు. ఆఖరికి తనకు ఓట్లు వేసిన పేద ప్రజల నోరుకొట్టి కోట్లు గడిస్తున్నారని విమర్శించారు. లీటరు పాలకు 18 రూపాయలు ఇచ్చి రైతుల పొట్ట గొడుతున్నారని ఆరోపించారు. ఇంకొకసారి చంద్రబాబును గూర్చి మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు.
Related News
Rise Survey on AP : ఏపీలో కూటమిదే విజయం
కూటమి పార్టీలు 108 నుంచి 120 వరకు స్థానాల్లో గెలువనున్నాయని , అధికార వైసీపీ పార్టీ 41 నుంచి 54 స్థానాల లోపే పరిమితం కానుందని సర్వే సంస్థ వెల్లడించింది