CSK: వివాదంలో చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్ డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వివాదంలో చిక్కుకుంది. ఈ మెగా వేలంలో ధోని సేన 21 మందిని కొనుగోలు చేసింది.
- By Naresh Kumar Published Date - 05:35 PM, Wed - 16 February 22
ఐపీఎల్ డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వివాదంలో చిక్కుకుంది. ఈ మెగా వేలంలో ధోని సేన 21 మందిని కొనుగోలు చేసింది. ఇందులో 7మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. నలుగురి రిటైన్తో కలిపి మొత్తంగా ఇప్పుడు చెన్నై జట్టులో 25 మంది ఉన్నారు. ఈ వేలం కోసం చెన్నై సూపర్ కింగ్స్ రూ.87.05 కోట్లు ఖర్చు చేసింది. అయితే ఈసారి చెన్నై జట్టు వేలంలో శ్రీలంక స్టార్ స్పిన్నర్ మహీశ్ తీక్షణను 70 లక్షలకు కొనుగోలు చేసింది.
అయితే ఈ అరిలంక ఆటగాడిని కొనుగోలు చేయడం ఇప్పుడు భారీ వివాదానికి దారితీసింది..చిన్ని సూపర్ కింగ్స్ ను ప్రాణంగా భావించే సొంత అభిమానులే ఇప్పుడా జట్టుపై దుమ్మెతిపోసే పరిస్థితికి తీసుకొచ్చింది.. కొందరు అభిమానులలైతే ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీని ఐపీఎల్ నుంచి బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. తమిళ ప్రజలకు చేదు మిగిల్చిన శ్రీలంక దేశస్తులని చెన్నై జట్టులోకి ఎందుకు ఎంపిక చేసుకున్నారని వారు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ యాజమాన్యంపై నిప్పులుచెరుగుతున్నారు. భారీ ఎత్తున భారతీయ తమిళులను బయటికి పంపించిన శ్రీలంకకు చెందిన ప్లేయర్ ను చెన్నై జట్టులోకి ఎలా తీసుకుంటారని సీఎస్కే మేనేజ్ మెంట్ పై మండిపడుతున్నారు.
Tags
Related News
MI vs CSK: ముంబైతో మ్యాచ్కు ముందు చెన్నైకు బిగ్ షాక్.. ఇది ఊహించలేదు..!
ఐపీఎల్లో 2024లో 29వ మ్యాచ్ ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్ (MI vs CSK) మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్కు ముందు సీఎస్కే జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.