Gold Price: పసిడి ప్రియులకు అలర్ట్.. హైదరాబాద్, విజయవాడల్లో తులం ఎంతంటే..?
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు పెరిగాయి.
- Author : Gopichand
Date : 08-10-2023 - 7:34 IST
Published By : Hashtagu Telugu Desk
Gold Price: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు పెరిగాయి. ఆదివారం ఉదయం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,750గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,540గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.75,000కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఆదివారం (అక్టోబర్ 08, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
We’re now on WhatsApp. Click to Join.
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,690గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.53,700 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,580గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,750 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.57,540 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,540గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,540గా ఉంది.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 72,100 ఉండగా, ముంబైలో రూ.72,100గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.75,000 ఉండగా, కోల్కతాలో రూ.72,100గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.68,800 ఉండగా, కేరళలో రూ.75,000గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.75,000 ఉండగా, విజయవాడలో రూ.75,000 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.