Anna Canteen:వైసీపీ శ్రేణులు ధ్వంసం చేసిన అన్నా క్యాంటీన్లో భోజనం వడ్డించిన చంద్రబాబు..
కుప్పంలో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను గురువారం ఉదయం వైసీపీ శ్రేణులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.
- By Hashtag U Published Date - 05:01 PM, Thu - 25 August 22
కుప్పంలో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను గురువారం ఉదయం వైసీపీ శ్రేణులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం జరిగింది. పరస్పరం భౌతిక దాడులకు కూడా దిగారు. వెరసి చంద్రబాబు వైసీపీ శ్రేణుల తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించారు.
పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టిన తర్వాత టీడీపీ శ్రేణులు అన్నా క్యాంటీన్ను పునర్మించాయి. అప్పటికే తయారు చేసి ఉంచిన వంటకాలను కూడా అక్కడికి తీసుకొచ్చారు. దీంతో కాస్తంత ఉత్సాహంగా కనిపించిన చంద్రబాబు… అన్నా క్యాంటీన్లోకి వెళ్లి స్వయంగా ప్రజలకు వడ్డించారు. వైసీపీ అడ్డుకున్నా కూడా అన్నా క్యాంటీన్ ద్వారా పేదల ఆకలిని తీరుస్తున్నామంటూ టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి.
Related News
AP Funds : పథకాల నిధులు పక్కదారి.. కాంట్రాక్టర్లకు చెల్లింపులు..!
పోలింగ్ ముగిసి నాలుగు రోజులు గడుస్తున్నా ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం లేదు.