Chandrababu : నందిగామలో చంద్రబాబు రోడ్షో.. ప్రచార రథంపైకి రాయి విసిరిన అగంతకుడు..
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలో గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. రాయి వేసిన..
- By Prasad Published Date - 09:39 PM, Fri - 4 November 22
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలో గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. రాయి వేసిన సమయంలో విద్యుత్ లేదు. ఈ ఘటనలో చంద్రబాబు చీఫ్ సెక్యురుటీ ఆఫీసర్ మధుబాబుకు గాయాలైయ్యాయి. తన రోడ్ షో లో కాన్వాయ్ పై రాయి విసిరిన ఘటనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగల్లా వైసీపీ వాళ్లు రాళ్లు విసిరారని చంద్రబాబు మండిపడ్డారు. అక్రమ కేసులు, దాడులతో రాజ్యం చేయాలని అధికార వైసీపీ చూస్తోందని.. కేసులు, దాడులకు భయపడే పార్టీ టీడీపీ కాదని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం రావాలి అంటే మళ్లీ టీడీపీ జెండా ఎగరాలని.. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు అంతా కలిసి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
Related News
Sharmila : అద్దంలో చూసుకుంటే జగన్కు చంద్రబాబు ముఖమే కనబడుతోందా?: షర్మిల
YS Sharmila: ఏపి కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) మరోసారి సీఎం జగన్(CM Jagan)పై విమర్శలు గుప్పించారు. కడపలో ఈరోజు ఆమె మాట్లాడుతూ..తనపై జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుతో నేను చేతులు కలిపానని ఏ ఆధారాలతో చెబుతున్నారు అంటూ షర్మిల నిలదీశారు. సీఎం జగన్ మానసిక పరిస్థితిపై వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. పదే పదే చంద్రబాబు పేరును జగన్ జపించడంపై ఆమ�