NCBN positive: టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కరోనా బారిన పడ్డారు.
- By Hashtag U Published Date - 10:07 AM, Tue - 18 January 22

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కరోనా బారిన పడ్డారు. నిన్న మాజీ మంత్రి నారా లోకేష్ కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. దీంతో చంద్రబాబు నాయుడు కూడా కరోనా టెస్టులు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నట్లు చంద్రబాబు ట్విట్టర్ లో వెల్లడించారు.
ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నానని.. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని ఆయన వెల్లడించారు. మరోవైపు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా కరోనా బారినపడినట్లు ఆయన ట్విట్టర్ లో వెల్లడించారు. డాక్టర్ల సలహా మేరకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నానని..గత కొన్ని రోజులుగా తనని కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోని తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.
I've tested positive for COVID with mild symptoms. I have quarantined myself at home and taking all the necessary precautions.
I would request those who came in contact with me to get themselves tested at the earliest. Please be safe and take care.
— N Chandrababu Naidu (@ncbn) January 18, 2022
నేను కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయినది. డాక్టర్ల సలహా మేరకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
— Devineni Uma (@DevineniUma) January 18, 2022