KYC Rules: కేవైసీ నిబంధనలపై కేంద్రం ప్రభుత్వం పునః పరిశీలించాలి: మంత్రి గంగుల
కేవైసీ నిబంధనలు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వానికి పునః పరిశీలించాల్సిందిగా మంత్రి గంగుల మరోసారి విజ్ఞప్తి చేశారు.
- By Balu J Published Date - 01:08 PM, Wed - 27 September 23
ఆహార భద్రత కార్డులో కేవైసీ నిబంధనలు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వానికి పునః పరిశీలించాల్సిందిగా మంత్రి గంగుల మరోసారి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గత కాంగ్రెస్ వైఫల్యాల వల్ల వలసలు పోయిన ఎంతోమంది విదేశాలు, బొంబాయి, బివండి, సోలాపూర్ తదితర ప్రాంతాల్లో ఉండి ప్రస్తుతం కేవైసీ కోసం తిరిగి రావాలనే ఆందోళనలో ఉన్నారని, అలాంటి వారు ఎవరు అధైర్య పడద్దని, రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్కరి కార్డును తొలగించదని, పూర్తిగా ప్రజలకు మద్దతుగా ఉంటుందని అన్నారు మంత్రి గంగుల కమలాకర్.
కాగా బడుగు బలహీన వర్గాలకు చెందిన దాసోజు శ్రవణ్, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన కుర్ర సత్యనారాయణల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ పరిగణలోకి తీసుకోవాలని సూచించారు మంత్రి గంగుల కమలాకర్, గవర్నర్ తీసుకున్న చర్యతో వెనుకబడిన వర్గాలకు ఎంతో ఆవేదనతో ఉన్నారని అవమానం జరిగినట్టుగా భావిస్తున్నారని, ఇలాంటి చర్యల్ని గవర్నర్ ద్వారా బిజెపి చేయించడం హేయమన్నారు. గవర్నర్ సైతం రాజకీయంగా క్రియాశీలకంగా ఉండి ఆ పదవిలోకి వచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు మంత్రి గంగుల కమలాకర్.
Related News
PM Modi: కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల శక్తి బీజేపీ-ఎన్డీయేకు మాత్రమే ఉంది : ప్రధాని మోదీ
PM Modi: తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలకు దూరదృష్టి లోపించిందని, బీజేపీ-ఎన్డీయే మినహా మరే రాజకీయ శక్తి ఈసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ 15 సీట్లకు మించి గెలవదు. కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా హాఫ్ సెంచరీ మార్కును కూడా దాటలేకపోతోంది. పశ్చిమబెంగాల్ లో కూడా వామపక్షాల పరిస్థితి ఏంటో �