Uttarakhand:ఉత్తరాఖండ్ లో ఘోర బస్సు ప్రమాదం…25మంది మృతి..!!
ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 25 మంది మరణించారని సమాచారం.
- By hashtagu Published Date - 12:11 AM, Mon - 6 June 22

ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 25 మంది మరణించారని సమాచారం. ఉత్తరాఖండ్ రాష్ట్రం, ఉత్తరకాశి, జిల్లాలో యమునోత్రి జాతీయ రహదారిపై దమ్టా దగ్గర ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లా నుంచి 40మంది భక్తులతో బస్సు యమునోత్రి వెళ్తుండగా లోయలో పడింది. ప్రమాద సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది…ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు.
#Breaking
Tragic bus accident in #Uttarakhand. Bus carrying 28 pilgrims fall into gorge. @dilipdsr joins in with more details. #ITVideo #Uttarkashi | @poojashali pic.twitter.com/hkzzysetSN— IndiaToday (@IndiaToday) June 5, 2022
ఈ ప్రమాదంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు రెండు లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డవారికి రూ.50వేల సాయం అందిస్తామని ప్రకటించారు.