Bull Attack : పగ పట్టిన ఎద్దు ..భయం భయంతో తిరుగుతున్న ప్రజలు
ఓ ఎద్దు మనుషులను పగ పట్టింది. మనిషి కనిపిస్తే దాడి చేస్తుంది
- By Sudheer Published Date - 12:23 PM, Mon - 31 July 23

మొన్నటి వరకు పాములు మాత్రమే పగ పడుతుందని విన్నాం..కానీ ఇప్పుడు పామే కాదు కోతులు , కుక్కలు ఆఖరికి ఎద్దులు (Bull Attack) కూడా పగ పడుతున్నాయి. మనిషి కనిపిస్తే చాలు కోపంతో పరుగెత్తుకుంటూ వచ్చి కొమ్ములతో పొడిచేస్తున్నాయి. ఎద్దులు పగ పట్టడం ఏంటి అనుకుంటున్నారా..నిజమండి. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని బలియా (Ballia) జిల్లాలో ఇదే జరుగుతుంది. ఓ ఎద్దు మనుషులను పగ పట్టింది. మనిషి కనిపిస్తే దాడి చేస్తుంది. ఇప్పటివరకు దాదాపు 12 మందిని గాయపరిచింది.
ఆ ఎద్దు కు భయపడి ప్రజలెవరూ రోడ్ల పైకి రావడం లేదు. ఒకవేళ వచ్చిన భయం భయంతో తిరుగుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి వెంట ఈ ఎద్దు పడడంతో అతడు భయంతో చెట్టు ఎక్కి ఏకంగా మూడు గంటల పాటు కిందకు దిగకుండా అక్కడే ఉండిపోయాడు. అయినప్పటికీ వదలకుండా ఆ చెట్టు కిందనే ఆ ఎద్దు నిల్చుని ఉంది. ఈ ఘటన ఫై యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ స్పందించారు. ఇలాంటి ఎద్దులను అరికట్టేందుకు బుల్ ప్రొటెక్షన్ పోలీసులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ ప్రాంతంలో ఇప్పటివరకు ఇలా దారితప్పిన 3,910 ఎద్దులను సంరక్షణ కేంద్రాలకు తరలించామని తెలిపారు. ప్రస్తుతం రైతు వెంట పడిన ఎద్దును పట్టుకునేందుకు ఓ బృందం రంగంలోకి దిగింది.
बलिया में आवारा सांड से जान बचाने के लिए एक किसान करीब 2 घंटे तक पेड़ पर बैठा रहा, वीडियो वायरल होने के बाद डीएम ने संज्ञान लिया!!#Ballia #UttarPradesh pic.twitter.com/5LpQqUNHnW
— Gaurav Dixit (@GauravKSD) July 28, 2023
Read Also: ఆదిలాబాద్ జిల్లాలో వాగులో పడిన రైతు.. మహారాష్ట్రలో శవమై తేలాడు