KTR: మంత్రి వేములకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పరామర్శ
మంజులమ్మ చిత్ర పటానికి ఆయన పుష్పాంజలి ఘటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
- By Balu J Published Date - 11:50 AM, Tue - 17 October 23
KTR: రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ ఇటీవల మృతి చెందగా..మంగళవారం నాడు ఆయన్ను నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లోని వారి నివాసంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్,పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా మంజులమ్మ చిత్ర పటానికి ఆయన పుష్పాంజలి ఘటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మంత్రి వేములను,వారి కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం చెప్పారు.
మంత్రి ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ.. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్ 12న తుదిశ్వాస విడిచారు. తన తల్లి మరణంతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శోకసంద్రంలో మునిగిపోయారు. మంజులమ్మ మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం ప్రకటించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ మరణం వార్త తెలిసిన వెంటనే సీఎం కేసీఆర్ స్వయంగా ఇంటికి పరామర్శించిన విషయం తెలిసిందే.
Also Read: Hyderabad: హైదరాబాద్లో ఓటర్ల జాబితా నుంచి 46,000 మంది పేర్లు తొలగింపు
Related News
KTR : ఇదేనా మీ మొహబ్బత్ కీ దుకాణ్.. అచ్చంపేట ఘటనపై కేటీఆర్ ట్వీట్
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో మంగళవారం రోజు బీఆర్ఎస్ కౌన్సిలర్ బాలరాజు ఇంటిపై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటనపై బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ స్పం దించారు.