MLC Kavitha: బిల్కిస్ బానో కేసు తీర్పును స్వాగతించిన కల్వకుంట్ల కవిత
- By Balu J Published Date - 06:03 PM, Mon - 8 January 24
MLC Kavitha: బిల్కిస్ బానో కేసు దోషుల ముందస్తు విడుదలను రద్దు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వాగతించారు. ఈ మేరకు కవిత గారు “ఎక్స్” లో స్పందించారు. మహిళల పట్ల నిబద్ధత విషయంలో సుప్రీంకోర్టు తీర్పు బలమైన సందేశాన్ని ఇస్తోందని తెలిపారు. ఇలాంటి ప్రతి తీర్పు మహిళలకు అండగా నిలుస్తుందనడానికి ఉదాహరణ అని అభప్రాయపడ్డారు. న్యాయం గెలిచిందని స్పష్టం చేశారు.
కాగా, బిల్కిస్ బానో దోషులను ముందస్తు విడుదల విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సరికాదని, వాటిని రద్దు చేయాలని కోరుతూ గతేడాది మే నెలలో అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కు ఎమ్మెల్సీ కవిత లేఖ రాసిన సంగతి తెలిసిందే.
బిల్కిస్ బానో కేసులో 11మంది దోషులను జైలు నుంచి విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ చర్యలు చేపట్టే సమర్థత గుజరాత్ ప్రభుత్వానికి లేదని, ఆ విషయం.. మహారాష్ట్ర చేతుల్లో ఉందని పేర్కొంది. నిందితులకు 2 వారాల సమయాన్ని ఇస్తూ.. ఆలోగా జైలులో లొంగిపోవాలని తీర్పులో స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో.. న్యాయం కోసం పోరాడుతున్న బిల్కిస్ బానోకు విజయం లభించినట్టు అయ్యింది.
“వాస్తవాలను తప్పుదో పట్టించి, క్షమాపణల కోసం దోషులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. క్షమాపణ అంగీకరించి, దోషులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఎప్పుడు గుజరాత్ ప్రభుత్వానికి చెప్పలేదు. ఇది నేరపూరత చర్య. ఈ విషయంలో బాధితురాలి హక్కును పరిగణలోకి తీసుకోవాలి. ఆ మహిళకు గౌరవం ఇవ్వాలి. దోషులను విడుదల చేసే ముందు గుజరాత్ ప్రభుత్వం.. నాటి తీర్పును వ్యతిరేకిస్తూ రివ్యూ పిటీషన్ని వేసుండేది. కానీ అలా చేయలేదు. దోషులను విడిచిపెట్టే సమర్థత గుజరాత్ ప్రభుత్వానికి లేదు,” అని బిల్కిస్ బానో కేసుల తీర్పును వెలువరించిన జస్టిస్ బీవై నగరత్న, జస్టిస్ ఉజ్జల్ భవన్లతో కూడిన సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.
గోద్రా ఘటన నేపథ్యంలో చెలరేగిన అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో వయస్సు 21ఏళ్లు. అప్పటికి ఆమె 5 నెలల గర్భవతి. అల్లర్లలో.. ఏడుగురు కుటుంబసభ్యులను కోల్పోయింది బిల్కిస్ బానో. వారిలో తన 3ఏళ్ల కుమార్తె కూడా ఉండి. అంతేకాకుండా.. ఆ నాడు, ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. బిల్కిస్ బానో కేసు దర్యాప్తును గుజరాత్ నుంచి ముంబైకి తరలించారు. కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లింది. 11మంది నిందితులను జీవిత ఖైదు చేయాలని 2008లో తీర్పునిచ్చింది స్పెషల్ కోర్టు.
Related News
MLC Kavitha : 63 రోజులు అవుతున్నా కవిత బెయిల్పై నో క్లారిటీ..!
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ విచారణలో ఇప్పటికే తీహార్ జైలులో ఉన్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కుమార్తె కవితను సిబిఐ అరెస్టు చేసింది. ఈడీ ఆమెను గతంలో మార్చి 15న హైదరాబాద్లో అరెస్టు చేసింది.