MLC Kavitha: ప్రగతి భవన్ కు బయలుదేరిన కల్వకుంట్ల కవిత
ఆమె బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఓటింగ్ సరళిపై, ఫలితాల గురించి చర్చించనున్నారు.
- By Balu J Published Date - 08:38 AM, Sun - 3 December 23
MLC Kavitha: ఆదివారం ఓట్ల లెక్కింపుకు సంబంధించి రౌండ్ల వారీ అప్డేట్ల కోసం ప్రతి పార్టీ నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్నికల పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రగతి భవన్ కు బయలు దేరారు.
ఆమె బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఓటింగ్ సరళిపై, ఫలితాల గురించి చర్చించనున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రగతి భవన్ కు బయలు దేరేముందు మీడియాతో మాట్లాడుతూ మంచి జరుగుతుంది అంటూ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటలకు ఈవీఎంల లెక్కింపు ప్రారంభమై 9.30 గంటలకు తొలి రౌండ్ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
Related News
Congress ‘Special Manifesto’ : తెలంగాణ కోసం భారీ హామీలు ప్రకటించిన కాంగ్రెస్
గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కలిసి మేనిఫెస్టోను విడుదల చేశారు