BRS Minister: కాంగ్రెస్ గ్యారెంటీలు అన్ని బూటకం.. ఓట్ల కోసం మాత్రమే వాళ్ళ డ్రామాలు
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని కేసిఆర్ ఫంక్షన్ హాల్లో అఖిల భారత రైతు సంఘాల నాయకులు బుధవారం సమావేశమయ్యారు.
- By Balu J Published Date - 06:26 PM, Wed - 1 November 23
BRS Minister: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని కేసిఆర్ ఫంక్షన్ హాల్లో అఖిల భారత రైతు సంఘాల నాయకులు బుధవారం సమావేశమయ్యారు. తెలంగాణ రైతు పథకాలపై వారు కూలంకషంగా చర్చించారు. కోట పాటి నర్సింహం నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో రఘునాథ్ దాదా పాటిల్ – మహరాష్ట్ర -శేత్కారి సంఘటన్, రాఘవేంద్ర కుమార్ – ఉత్తర ప్రదేశ్ -క్రిషి భూమి బాచఓ మోర్చ, సేవాసింగ్ ఆర్యా – హర్యానా -బికేయు, K.M. రామ గౌందర్ – తమిళనాడు – తమిళ్ వ్యవసాయ సంఘం,పరశురాం లక్ష్మణ్ – కర్నాటక – ఫర్మార్స్ అసోసియేషన్స్ ఆఫ్ కర్నాటక,కోటపాటి నర్సింహం నాయుడు – తెలంగాణ – సౌత్ ఇండియన్ ఫార్మాస్ ఫెడరేషన్ అధ్యక్షులు,డా.మంగి రామ్ – హర్యానా, K.నాగరాజు – కర్నాటక, అన్నుమాంతరాసు – తమిళనాడు,బాల సాహెబ్ వాడ్కే – మహారాష్ట్ర తో పాటు పలువురు స్థానిక రైతులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం గ్యారెంటీలు అని అబద్ధాలు చెప్తుందనీ ,కర్ణాటకలో మేము నమ్మి ఓట్లు వేసి పోస పోయామని తెలంగాణ ప్రజలు మోసపోకండనీ కర్ణాటక రైతు సంఘ నాయకుడు పరుశురాం లక్ష్మణ్ అన్నారు. వ్యవసాయానికి 5 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నారని అది కూడా అర్థరాత్రి ఇస్తున్నారని కర్ణాటకలో ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందనీ ఆవేదన వ్యక్తంచేశారు. ఇక్కడ కేసిఆర్ 24 గంటల కరెంట్ ఇస్తూ రైతులను కంటికి రెప్పలా చూసుకుంటున్నడని వారు అభిప్రాయ పడ్డారు.
తమ పాలిత రాష్ట్రాల్లో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టారు..కరెంట్ బిల్లులు కడుతున్నమని, సాగునీటి పన్ను ఏడాదికి 12 వేలు కడతామని..కానీ ఇక్కడ కేసిఆర్ రైతులకే 10వేలు ఇస్తున్నారని కొనియాడారు శేత్కారి సంఘటన్ నాయకులు రఘునాథ్ దాదా పాటిల్. రైతు కోసం కేసిఆర్ లా ఆలోచించే నాయకుడు దేశంలోనే ఎవరూ లేరన్నారు.దేశానికి రైతాంగానికి భరోసా కేసిఆర్ అని, తెలంగాణ ప్రజలు కేసిఆర్ ను మూడో సారి ముఖ్యమంత్రిని చేయండి…రానున్న రోజుల్లో అన్ని రాష్ట్రాల రైతులం కలిసి ప్రధానిని చేస్తామన్నారు.అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అని నినదించిన ఏకైక రాజకీయ నాయకుడు కేసిఆర్ అని,రైతు పక్షపాతి కేసిఆర్ లాంటి నాయకుడు దేశానికి అవసరం..ఆయన్ను ఇక్కడి రైతులు కాపాడుకోవాలనీ మహారాష్ట్ర,ఉత్తర ప్రదేశ్,తమిళనాడు,కర్ణాటక,హర్యానా రైతు సంఘాల నాయకులు ముక్త కంఠంతో పిలుపునిచ్చారు.
Related News
Harish Rao: బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోం: హరీశ్ రావు
Harish Rao: పీర్జాదిగూడ మునిసిపల్ మేయర్, కార్పొరేటర్లపై కాంగ్రెస్ దాడిని ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఖండించారు. పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్లో ఎలాగైనాసరే అవిశ్వాస తీర్మానం నెగ్గాలని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. ‘‘ఔటర్ రింగ్ రోడ్డుపై 20 కార్లత�