HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Brs Former Mp Vinodkumar Said The Government Should Support The Farmers Compensation Of Ten Thousand Per Acre Should Be Given

Vinod Kumar: ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి, ఎకరాకు పది వేల పరిహారం ఇవ్వాలి

  • By Balu J Published Date - 11:35 PM, Tue - 19 March 24
  • daily-hunt
Brs Ex Mp Vinod Kumar Comme

Vinod Kumar: వడగళ్ల వర్షం కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు పది వేల పంట నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు పోతుగల్, సేవాలాల్ తండా, గన్నేవానిపల్లి,తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్ గ్రామాల్లో వడగళ్ల వర్షం కారణంగా దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించిన అనంతరం సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు.

అంతకు ముందు ముస్తాబాద్ మండల కేంద్రంలో నిన్న వడగళ్ల వర్షం కారణంగా చెట్టు,విద్యుత్ స్తంభం విరిగి పడిన సంఘటనలో మృతి చెందిన ఎల్సాని ఎల్లయ్య కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం ₹10లక్షల సాయం అందించడంతో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మృతుడికి రైతు భీమా చేయడం జరిగిందని, ₹5లక్షల రైతుభీమా సొమ్మును వెంటనే రైతు కుటుంబానికి వచ్చే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ కు పోన్ చేసి తెలపడం జరిగింది.

ఈ సందర్భంగా మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి వేలాది రూపాయలు ఖర్చు పెట్టి పంటలు సాగు చేశారని…వడగళ్ల వానతో రెక్కల కష్టం నేలపాలవ్వడంతో రైతులు కన్నీరు పెడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు తక్షణమే ₹10వేల చొప్పున పంట నష్ట పరిహారం అందించాలని కోరారు. వడగళ్ల వర్షం కారణంగా దెబ్బతిన్న పంటలను తక్షణమే సర్వే చేయించి పంట నష్టం అంచనా వేయించి రైతులకు నష్ట పరిహారం అందే విదంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేసి కోరారు. పంట పొలాలకు కాల్వల్లో మోటార్లు వేసుకుని నీళ్లు పారించుకున్న గన్నేవానిపల్లి రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలను కోరారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs party
  • kareemnagar
  • vinod kumar

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd