Bomb Blast : పేలుడు ఎవరిపనో తెలుసుకుంటున్నాం- ఎస్పీ
పంజాబ్ లోని లూథియానా కోర్టులో హై గ్రేడ్ పేలుడు సంభవించింది. ఆ పేలుడుకు ఒకరు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. సెషన్స్ కోర్టు కాంప్లెక్స్లోని వాష్రూమ్లో గురువారం ఈ సంఘటన జరిగింది.
- By CS Rao Published Date - 04:48 PM, Thu - 23 December 21
పంజాబ్ లోని లూథియానా కోర్టులో హై గ్రేడ్ పేలుడు సంభవించింది. ఆ పేలుడుకు ఒకరు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. సెషన్స్ కోర్టు కాంప్లెక్స్లోని వాష్రూమ్లో గురువారం ఈ సంఘటన జరిగింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కి చెందిన రెండు బృందాలు చండీగఢ్, ఢిల్లీ నుంచి వేర్వేరుగా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును వేగవంతం చేశాయి. భద్రతా వర్గాల సమాచారం ప్రకారం, ఇది “ఆత్మహత్య బాంబు దాడి” గా అనునిస్తున్నాయి. బాంబు పేలుడు స్వభావం ఆధారంగా బాంబుగా అనుమానిస్తున్నారు.
Punjab | Police say one person has died, two injured in explosion at Ludhiana District Court Complex
Bomb disposal squad and a forensics team called in. pic.twitter.com/YahMBYLBHp
— ANI (@ANI) December 23, 2021
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆరు అంతస్థుల కోర్టు కాంప్లెక్స్లోని రెండో అంతస్తులో మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించగా, చుట్టుపక్కల వారు గాయపడ్డారు. పేలుడు కారణంగా వాష్రూమ్లోని రెండు గోడలు కూలిపోయి ఒక కిటికీ పగిలిపోయాయి. పేలుడు పదార్థం ఎలాంటిదనే విషయంపై పోలీసులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
Dy Punjab CM Sukhjinder Singh Randhawa visited the hospital to meet the injured patients from the Ludhiana District Court explosion
"Patients have minor injuries. One of them said the explosion sound was too loud as if a building fell. Pakistan doesn't want us stable," he said pic.twitter.com/ZI7TTynjiy
— ANI (@ANI) December 23, 2021
ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించారు. పేలుడు పదార్థాల నిపుణులు కూడా ఘటనా స్థలంలో ఉన్నారు’’ అని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి తెలిపారు.
పేలుడు పదార్థాన్ని పురుషుల టాయిలెట్లో ఉంచారు. పేలుడు టైంలో చుట్టూ నలుగురైదుగురు మాత్రమే ఉన్నారు. ఒకరు మరణించగా, ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. కోర్టు వద్ద భద్రతను పెంచారు. కోర్టు కాంప్లెక్స్లోని సీసీటీవీ ఫుటేజీతోపాటు ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను పరిశీలిస్తున్నారు.
Related News
Rameswaram Cafe : పున: ప్రారంభమైన ‘రామేశ్వరం కేఫ్’ సర్వీసులు
Rameswaram Cafe: బెంగళూరు(Bangalore)లోని ‘రామేశ్వరం కేఫ్’(Rameswaram Cafe) బాంబు బ్లాస్ట్ జరిగిన 8 రోజుల తర్వాత తిరిగి తెరచుకుంది. నిర్వాహకులు శనివారం ఉదయం కేఫ్ పున:ప్రారంభించారు. కేఫ్ను తెరవడానికి ముందు కేఫ్ సహ-వ్యవస్థాపకుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao), అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అంతా జాతీయ గీతాన్ని(National Anthem) ఆలపించారు. అనంతరం కస్టమర్ల సర్వీసులు ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో కస్టమర్లు తరలి వస్తుండడ