Presidential Candidate: రాష్ట్రపతిగా వెంకయ్య లేదా ఓబీసీ మహిళ?
అధిష్టానం సంకేతాలు లేకుండా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎలాంటి రాజకీయ ప్రయత్నాల చేయరు.
- By CS Rao Published Date - 02:34 PM, Mon - 9 May 22
అధిష్టానం సంకేతాలు లేకుండా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎలాంటి రాజకీయ ప్రయత్నాల చేయరు. ప్రస్తుతం ఆయన రాష్ట్రపతి పదవి కోసం వేస్తున్న అడుగులు కూడా అధిష్టానంకు తెలిసి పడుతున్నవిగా భావించాలి. ఎందుకంటే, తొలి నుంచి బీజేపీ విధేయునిగా ఉంటూ నిబద్ధతతో కూడిన రాజకీయాలు చేస్తూ ఉప రాష్ట్రపతి పదవిని అందుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు రాష్ట్రపతి పదవిని ఇస్తే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలన్నీ మద్ధతు ఇచ్చే అవకాశం ఉంది. తెలుగుగువాడిగా ఆయన్ను గౌరవిస్తూ ఏపీ, తెలంగాణలోని టీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ సంయుక్తంగా మద్ధతు ఇవ్వడానికి ఏ మాత్రం సంకోచించవు. దక్షిణ భారత దేశం ఈక్వేషన్లో అన్నాడీఎంకే, డీఎంకే కూడా అండగా ఉంటాయనడంలో సందేహం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలు మద్ధతు ఇస్తే రాష్ట్రపతి పదవిని నల్లేరు మీద నడక మాదిరిగా బీజేపీ గెలుచుకుంటుంది. ఆ కోణం నుంచి అందరికీ ఆమోదయోగ్యమైన వెంకయ్యనాయుడుని రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రతిపాదించే అవకాశం ఉంది. అందుకే, ఆయన ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ మద్ధతును కూడగడుతున్నారని తెలుస్తోంది.
2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వెనుకబడిన తరగతి (OBC)కి చెందిన అభ్యర్థిని లేదా మహిళ అభ్యర్థిత్వాన్ని కూడా బీజేపీ పరిశీలిస్తోంది. దేశ జనాభాలో మహిళలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. షెడ్యూల్ తెగ (ST), షెడ్యూల్ కులం (SC) లేదా దక్షిణ భారతదేశానికి చెందిన అభ్యర్థి తదితర అనేక కోణాలను బీజేపీ పరిగణనలోకి తీసుకుంటోంది. 2024 పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిని ప్రతిపాదించనుంది. కుల ఆధారిత జనాభా గణన డిమాండ్ మధ్య దేశ మొత్తం జనాభాలో 40 శాతానికి పైగా OBCలు ఉన్నారని రాజకీయ పార్టీలకు ఉతెలుసు. అలాగే, భారతదేశ జనాభాలో దాదాపు సగం మంది మహిళలు ఉన్నారు. బీజేపీకి మహిళలే కొత్త ఓటుబ్యాంకు అని ప్రధాని నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో ప్రస్తావించారు. రాష్ట్రపతి పదవికి ఓబీసీ లేదా మహిళను నామినేట్ చేయవచ్చని ఒక టాక్ ఉంది. మహిళ ఓబీసీ అభ్యర్థిని ఎంపిక చేయవచ్చని బీజేపీ మరి కొన్ని వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రపతి అభ్యర్థిని నామినేట్ చేయడం ద్వారా OBC మరియు మహిళా ఓట్లను ఏకీకృతం చేయడం చాలా ముఖ్యం అనే కోణాన్ని బీజేపీ పరిశీలిస్తోంది.
ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఈసారి ఆ సామాజిక నుంచి రాష్ట్రపతి అభ్యర్థి వచ్చే అవకాశం లేదని పార్టీ అంతర్గత వ్యక్తి ఒకరు తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థికి ప్రస్తుతం ఓబీసీ, మహిళలకే ఎక్కువ ప్రాధాన్యం ఉందని ఆయన చెప్పారు. ఉత్తరప్రదేశ్ నుండి మహారాష్ట్ర వరకు అన్ని రాష్ట్రాలలో OBCలు ప్రధాన శక్తిగా ఉన్నారు. ఇటీవలి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో, పార్టీ నుండి కొంతమంది OBC నాయకులు నిష్క్రమించినప్పటికీ, బిజెపికి అధిక మద్దతు లభించింది. OBC కమ్యూనిటీ విశ్వాసాన్ని గెలుచుకోవడానికి BJP కూటమి భాగస్వామి JD-U సహా దాదాపు అన్ని పార్టీలు కుల ఆధారిత జనాభా గణనను డిమాండ్ చేసిన విషయం వ విదితమే. రాష్ట్రపతి అభ్యర్థిని ఓబీసీ వర్గం నుంచి నామినేట్ చేయడం ద్వారా ఖచ్చితంగా బీజేపీకి 2024 ఎన్నికల్లో కలిసొస్తుందని సీనియర్ కార్యకర్త ఒకరు చెబుతున్నారు. “మహిళలు మరియు OBC ఇద్దరూ స్వతంత్రంగా దేశంలో అతిపెద్ద ఓటర్లు. పార్టీ OBC మహిళా అభ్యర్థిని నామినేట్ చేయడం ద్వారా మరింత రాజకీయ లబ్ది పొందే అవకాశం ఉందని బీజేపీలోని ఎక్కువ మంది భావిస్తున్నారు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్, తెలంగాణ, కేరళ గవర్నర్గా ఉన్న అనుసూయా ఉయికే, తమిళిసై సౌందరరాజన్, ఆరిఫ్ మహ్మద్ ఖాన్, జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము పేర్లు బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రచారంలో ఉన్నాయి. వాళ్లలో ఎవరో ఒకర్ని నామినేట్ చేయడానికి అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరో వైపు వెంకయ్యనాయుడు వివిధ రాష్ట్రాలకు వెళుతోన్న సందర్భంగా రాష్ట్రపతి పదవికి మద్ధతను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. జూలైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల కోసం బీజేపీ అగ్రనాయకత్వం కసరత్తు ప్రారంభించిన క్రమంలో వెంకయ్య అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి.
Related News
Lok Sabha Election 2024: షాక్ ఇచ్చిన 3వ దశ పోలింగ్ శాతం
దేశంలో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దశల ఎన్నికలు పూర్తి అవ్వగా తాజాగా మూడో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అయితే మూడో దశలో ఓటర్లు షాక్ ఇచ్చారు. తొలి రెండు దశలతో పోల్చితే మూడో దశలు పోలింగ్ శాతం భారీగా తగ్గుముఖం పట్టింది.