Vande Bharat Fire: భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్తున్న వందేభారత్ రైలులో మంటలు.. ప్రయాణికులు సురక్షితం
ఢిల్లీ నుంచి భోపాల్ వెళ్తున్న వందేభారత్ రైలులో మంటలు (Vande Bharat Fire) చెలరేగాయి. ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు సమాచారం అందింది.
- By Gopichand Published Date - 09:30 AM, Mon - 17 July 23

Vande Bharat Fire: భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్తున్న వందేభారత్ రైలులో మంటలు (Vande Bharat Fire) చెలరేగాయి. ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు సమాచారం అందింది. సోమవారం ఉదయం రాణి కమలాపతి స్టేషన్ నుంచి నిజాముద్దీన్కు బయలుదేరిన వందేభారత్కు చెందిన సీ-14 బోగీలో కుర్వాయి స్టేషన్ సమీపంలో బ్యాటరీ నుంచి మంటలు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న అధికారులు ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక దళం ఘటన స్థలానికి చేరుకుంది.
అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. రైల్వే నుండి అందిన సమాచారం ప్రకారం.. కోచ్ లో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు. వారు కుర్వాయి కైతోరా వద్ద రైలు నుండి దిగారు. కోచ్లోని బ్యాటరీలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. కుర్వాయి కేథోరా స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ కోచ్ బ్యాటరీ బాక్స్లో మంటలు చెలరేగినట్లు భారతీయ రైల్వే తెలిపింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
Also Read: Delhi : ఢిల్లీలో భారీ వర్షాలు.. రేపటి వరకు స్కూల్స్ బంద్
ఈ సంఘటన బినా జంక్షన్ ముందు జరిగింది
రైలు నంబర్ 20171 భోపాల్-హజ్రత్ నిజాముద్దీన్ వందే భారత్ ఉదయం 5.40 గంటలకు భోపాల్ నుండి బయలుదేరింది. ఈ సంఘటన బీనా జంక్షన్ ముందు జరిగింది. బ్యాటరీ బాక్సు నుంచి మంటలు చెలరేగినట్లు రైలులో ప్రయాణిస్తున్న వారు తెలిపారు. దీనిపై రైల్వే శాఖకు సమాచారం అందడంతో వెంటనే రైలును నిలిపివేసి ప్రయాణికులందరినీ బయటకు పంపారు.
మధ్యప్రదేశ్లో తొలి వందే భారత్ రైలు
మీడియా కథనాల ప్రకారం.. వందేభారత్ రైలులో కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్, ఐఎఎస్ అవినాష్ లావానియాతో సహా చాలా మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటన తర్వాత రైలు మొత్తం ఖాళీ చేయించారు. మధ్యప్రదేశ్లోని రాణి కమలపాటి స్టేషన్, ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ మధ్య నడుస్తున్న ఈ రైలు మధ్యప్రదేశ్లోని మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు.