Cyclone Mocha: ప్రమాదకరంగా ‘మోకా’ తుపాను
'మోకా' తుపాను ప్రమాదకరంగా మారుతుంది. ఇది ఆదివారం బంగ్లాదేశ్ మరియు మయన్మార్ తీరాలను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
- By Praveen Aluthuru Published Date - 11:40 AM, Sun - 14 May 23
Cyclone Mocha: ‘మోకా’ తుపాను (Cyclone Mocha) ప్రమాదకరంగా మారుతుంది. ఇది ఆదివారం బంగ్లాదేశ్ మరియు మయన్మార్ తీరాలను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాను వల్ల బంగ్లాదేశ్ మరియు మయన్మార్లోని వేలాది మంది ప్రజలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. గంటకు 240 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, 12 అడుగుల ఎత్తున సముద్ర అలలు ఎగసిపడే అవకాశం ఉందని పేర్కొంది. మయన్మార్లోని రఖైన్ మరియు చిన్ రాష్ట్రాల్లో దీని ప్రభావం గరిష్టంగా కనిపిస్తుంది.
ఈ తుఫాను బంగాళాఖాతం వైపు కదిలితే పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి ఉపగ్రహ కేంద్రం హెచ్చరించింది. బంగ్లాదేశ్లోని విపత్తు సహాయ అధికారి మిజానూర్ రెహ్మాన్ మాట్లాడుతూ.. “ప్రజల ప్రాణాలను రక్షించడం మా ప్రాధాన్యత, తుఫాను మధ్యాహ్నం సమయానికి తాకడానికి ముందు మేము సుమారు 300,000 మందిని ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని అన్నారు .
తుఫాను సమీపంలో ఉన్న కాక్స్ బజార్ బీచ్ టౌన్లోని శిబిరాల్లో పది లక్షల మందికి పైగా శరణార్థులు నివసిస్తున్నారని సహాయక సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. మయన్మార్లోని పేద రాఖైన్ రాష్ట్రంలో గత వారం నుండి సుమారు 100,000 మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. మయన్మార్ ఎయిర్వేస్ ఇంటర్నేషనల్ రాఖైన్ తమ అన్ని విమానాలను సోమవారం వరకు నిలిపివేసినట్లు తెలిపింది. మయన్మార్ రెడ్క్రాస్ సొసైటీ అత్యవసర పరిస్థితికి సిద్ధమవుతున్నట్లు తెలిపింది. బంగ్లాదేశ్లోని అతిపెద్ద ఓడరేవు చిట్టగాంగ్లో కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి. పడవ రవాణా మరియు చేపల వేట కూడా నిషేధించబడింది.
Read More: Karnataka: కర్ణాటక నుంచి ఔట్.. బెడిసికొట్టిన బీజేపీ ‘మిషన్ సౌత్’
Related News
Women’s T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్ విడుదల.. భారత్- పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్ను ఐసీసీ విడుదల చేసింది. బంగ్లాదేశ్లో ఈ టోర్నీ నిర్వహించనున్నారు.