HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Balasore Train Accident Toll Mounts To 291

Odisha Train Accident: రైలు ప్రమాదంలో 291కి చేరిన మృతుల సంఖ్య

ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాదంలో గాయపడిన వ్యక్తుల్లో ఈ రోజు ఒకరు మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. బీహార్ నివాసి ఎస్సీబీ మెడికల్ కాలేజీలో చికిత్స తీసుకుంటూ ఈ రోజు శనివారం మృతి చెందాడు.

  • By Praveen Aluthuru Published Date - 06:08 PM, Sat - 17 June 23
  • daily-hunt
Odisha Train Accident
New Web Story Copy 2023 06 17t180841.430

Odisha Train Accident: ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాదంలో గాయపడిన వ్యక్తుల్లో ఈ రోజు ఒకరు మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. బీహార్ నివాసి ఎస్సీబీ మెడికల్ కాలేజీలో చికిత్స తీసుకుంటూ ఈ రోజు శనివారం మృతి చెందాడు. దీంతో ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 291కి చేరింది. ఈ విషయాన్నీ సంబంధిత అధికారులు దృవీకరించారు. చనిపోయిన ప్రయాణికుడిని బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లా రోషన్‌పూర్‌కు చెందిన సాహిల్ మన్సూర్ గా గుర్తించారు. అతని వయసు 32 సంవత్సరాలు. కాగా చనిపోయిన ఆ యువకుడు కిడ్నీ సంబంధిత వ్యాధితో కూడా బాధపడుతున్నాడని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అతను ప్రస్తుతం డయాలసిస్‌ చికిత్స తీసుకుంటున్నాడని సమాచారం. కార్డియాక్ అరెస్ట్ కారణంగా రోగి మరణించాడని ఎస్‌సిబి మెడికల్ కాలేజీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధాన్సు శేఖర్ మిశ్రా తెలిపారు.

ఎస్‌సిబి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరిన 205 మంది క్షతగాత్రులలో 46 మంది ఇంకా చికిత్స తీసుకుంటున్నారు. ఇందులో 13 మంది ఐసియులో ఉన్నారని మిశ్రా చెప్పారు. ఐసీయూలో ఉన్న 13 మంది క్షతగాత్రులలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉందని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా నిన్న శుక్రవారం బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలోని పాత్ర గ్రామానికి చెందిన ప్రకాష్ రామ్ (22) వలస కూలీ ఎస్సీబీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మరణించాడు. మంగళవారం తెల్లవారుజామున బీహార్‌కు చెందిన బిజయ్ పాశ్వాన్ అనే ప్రయాణికుడు కటక్‌లోని ఎస్‌సిబి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మరణించాడు.

జూన్ 2న జరిగిన ట్రిపుల్ రైలు ప్రమాదంలో 287 మంది అక్కడికక్కడే మరణించగా 1,208 మంది గాయపడ్డారు. షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మరియు ఒక గూడ్స్ ఈ మూడు రైళ్లు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఆ సమయంలో గూడ్స్ రైలు ఆగి ఉన్నది.

Read More: Thalapathy Vijay: రాజకీయాల్లోకి విజయ్ దళపతి, తమిళనాడు లక్ష్యంగా పొలిటికల్ స్పీచ్!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 291
  • Balasore
  • bihar
  • deaths
  • ICU
  • odisha
  • Sahil Mansur
  • SCB Medical College
  • train accident

Related News

Bomb Threat

Bomb Threat : ఉలిక్కపడ్డ ముంబయి.. ఫ్రెండ్ మీద కోపంతో ఫేక్‌ ఉగ్ర బెదిరింపు మెయిల్‌

Bomb Threat : దేశ ఆర్థిక రాజధాని ముంబయి మరోసారి ఉగ్ర బెదిరింపులతో కాసేపు ఉలిక్కిపడింది. నగరంలో భారీ ఉగ్రదాడులు జరగనున్నాయంటూ శుక్రవారం ముంబయి ట్రాఫిక్‌ పోలీసులకు ఒక ఇమెయిల్‌ రావడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.

  • Train

    Prakasam: ప్రాణం కాపాడేందుకు రివర్స్‌ గేర్‌లో వెనక్కి వెళ్లిన ఎక్స్‌ప్రెస్ రైలు

Latest News

  • CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

  • Maharashtra : శృంగారానికి ఒప్పుకోలేదని కాబోయే భార్యను రేప్ చేసి హతమార్చాడు

  • AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

  • CM Siddaramaiah : చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd