Hyderabad : బాలానగర్ ఫ్లైఓవర్ పేరు మార్చిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్లోని బాలానగర్ ఫ్లైఓవర్ ఇక నుంచి ‘డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఫ్లైఓవర్’గా పిలవబడుతుందని తెలంగాణ ప్రభుత్వం
- By Prasad Published Date - 08:38 AM, Fri - 7 July 23
హైదరాబాద్లోని బాలానగర్ ఫ్లైఓవర్ ఇక నుంచి ‘డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఫ్లైఓవర్’గా పిలవబడుతుందని తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫ్రీడమ్ ఫైటర్గా, భారత ఉప ప్రధానిగా, సామాజిక న్యాయం కోసం ప్రచారకర్తగా, పేదల రక్షకుడిగా, అసాధారణ పార్లమెంటేరియన్గా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆదర్శప్రాయమైన సేవలందించారని MAUD విభాగం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. మాజీ ఉపప్రధానికి గౌరవప్రదంగా గుర్తిస్తూ, జులై 6, 2023న ఆయన వర్ధంతి సందర్భంగా బాలానగర్ ఫ్లైఓవర్కు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఫ్లైఓవర్ అని పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ను కోరారు.
Related News
TS : జూన్ 9 నుండి చేప ప్రసాదం పంపిణిః బత్తిని కుటుంబం వెల్లడి
Fish Prasadam: ప్రతి సంవత్సరం మృగశిర కార్తె సందర్భంగా బత్తిని కుటుంబ(Battini family) సభ్యులు చేప ప్రసాదం(Fish Prasadam) పంపిణి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈసారి కూడా చేప ప్రసాదం పంపిణి కార్యక్రమం సాగుతుందని బత్తిని కుటుంబం వెల్లడించింది. హైదరాబాద్(Hyderabad)లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్(Exhibition Ground)లో చేపప్రసాదం అందిస్తామని వారు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా బత్తిని కుటుంబం వారు తెలి�