APSRTC:ఏపీలో మరో బాదుడు.. భారీగా పెరిగిన ఆర్టీసీ చార్జీలు
ఏపీలో ఇప్పటికే కరెంట్ ఛార్జీల పెంపుతో సామాన్యుడిపై పెనుభారం పడింది. తాజాగా ఆర్టీసీ ఛార్జీలు పెంచడంతో సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- By Hashtag U Published Date - 04:24 PM, Wed - 13 April 22
ఏపీలో ఇప్పటికే కరెంట్ ఛార్జీల పెంపుతో సామాన్యుడిపై పెనుభారం పడింది. తాజాగా ఆర్టీసీ ఛార్జీలు పెంచడంతో సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ ఆర్టీసీ ఎండీ ద్వారాకతిరుమల రావు నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి ఆర్టీసీ బస్ చార్జీలపై డీజిల్ సెస్ విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పల్లె వెలుగు బస్సుల్లో కనీస ఛార్జ్ రూ .10గా నిర్ణయించారు. పల్లె వెలుగు లో రూ 2 రూపాయలు..
ఎక్స్ ప్రెస్ బస్సు లో రూ 5 పెంచుతూ ఆర్టీసీ ఎండీ నిర్ణయం తీసుకన్నారు. పెరిగిన ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. సెస్ విధింపు తో ఆర్టీసీ కి 720 కోట్ల ఆదాయం రానుంది. పెరిగిన డీజిల్ ధరలతో ప్రస్తుతం ఆర్టీసీలో భారం భరించలేని పరిస్థితి వచ్చిందని ఎండీ ద్వారకతిరుమల రావు తెలిపారు.
►విజయవాడ: గత రెండేళ్లుగా ఆర్టీసీకి అనేక ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి: ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు
►ఆర్టీసీకి రెండేళ్లుగా రూ.5,680 కోట్ల ఆదాయం తగ్గింది. pic.twitter.com/ReRdNrIrpx— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) April 13, 2022
Tags
Related News
Circuit Tour Buses : సర్క్యూట్ టూర్ బస్సులను సిద్ధం చేసిన APSRTC
పర్యాటకుల కోసం APSRTC సర్క్యూట్ టూర్ బస్సులను (Circuit Tour Buses) సిద్ధం చేసింది. మాములుగా ప్రవైట్ ట్రావెల్స్ వారు ఇలాంటి సర్క్యూట్ టూర్ బస్సులను నడుపుతుంటారు. కానీ ఇప్పుడు APSRTC సైతం ట్రావెల్ బస్సుల మాదిరిగా సర్క్యూట్ టూర్ బస్సులను నడపబోతుంది. విజయవాడ, అమరావతి, మంగళగిరి, పొన్నూరు, బాపట్ల సూర్యలంక బీచ్లని కవర్ చేస్తూ ప్రతిరోజూ విజయవాడ నుండి సర్క్యూట్ బస్సు బయలుదేరుతుంది. అలాగే విజయవాడ